Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
ముంబై మహిళ ఆత్మహత్య.. సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్తో లింకు!
బాలీవుడ్లో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా వరుస సక్సెస్లతో దూసుకెళ్తున్న సుశాంత్ రాజ్పుత్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆయన అభిమానులు నలుగురు సూసైడ్ చేసుకొన్నారు. తాజాగా ముంబైలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే సుశాంత్ మరణం తర్వాత ఆ మహిళ ఆరోగ్యం క్షీణించిందంటూ పేర్కొనడం ఈ వార్తలో ట్విస్టుగా మారింది. ఇంతకు మహిళ మరణం వెనుక అసలు కారణం ఏమిటంటే..
ఆకాశాన్ని అంటిన అభిమానం.. సుశాంత్కు కోసం ఫ్యాన్ ఏం చేశాడో తెలుసా?
పీఎంసీ బ్యాంకు స్కామ్తో
ఇటీవల జరిగిన బ్యాంకు కుంభకోణం పంజాబ్, మహారాష్ట్రంలో చాలా మందిని తీవ్ర నిరాశకు, తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణంతో చాలా మంది బ్యాంకు డిపాజిటర్లు రోడ్డున పడ్డారు. చాలా కష్టాలు పడి సేవింగ్స్ చేసుకొన్న ఖాతాదారులు బాంకు కుంభకోణంతో డీలా పడిపోయారు. దాంతో తీవ్రమైన క్షోభకు గురయ్యారు.
సుశాంత్ మరణంతో మరింత కుంగిపోయి
పీఎంసీ బ్యాంకు కుంభకోణంలో బాధితుల్లో ముంబైకి చెందిన ఓ మహిళ తీవ్ర వేదన గురవుతున్నది. ఆ కుంభకోణంలో తన సేవింగ్స్ను నష్టపోయిన 45 ఏళ్ల మహిళ అదే బాధతో అనారోగ్యానికి గురైంది. ఒంటరిగా గడుపుతూ అదే ధ్యాసలో ఓ రకమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఆ క్రమంలో ముంబైని సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ వార్త కుదిపేసింది. ఆ తర్వాత ఆమె సూసైడ్ చేసుకొని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది.
బ్యాంకు కుంభకోణం, సుశాంత్ మరణంతో
మహిళ మరణంపై భర్త మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ మరణం తర్వాత ఆమె మరింత డిప్రెషన్కు గురయ్యారు. పీఎంసీ బ్యాంకు కుంభకోణంతో కుంగిపోయిన మహిళ ఆ తర్వాత సుశాంత్ మరణ వార్తతో మరింత కుంగిపోయింది. అనంతరం ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. 15 రోజులుగా ఆరోగ్య, మానసిక పరిస్థితి అదుపుతప్పింది అని భర్త చెప్పారు.
బాధలో నా కుటుంబం
నా భార్య ఆత్మహత్యకు డబ్బు పోవడం ఓ కారణమైతే.. ఆ తర్వాత సుశాంత్ సూసైడ్ ఆమెను మరింత బాధపెట్టింది. ఈ రెండు విషయాలతో నా భార్య మనోవేధన మరింత పెరిగింది. మేము ఇంట్లో లేని సమయంలో తాను సూసైడ్ చేసుకొన్నారు. డబ్బు పోయిందనుకొంటే.. ఇప్పుడు నా భార్య కూడా దూరమైంది. ఇక మా కుటుంబం అంతా బాధలో మునిగిపోయింది అంటూ మహిళ భర్త ఆవేదన వ్యక్తం చేశారు.
Recommended Video
సీబీఐ విచారణకు డిమాండ్
ఇదిలా ఉండగా, సుశాంత్ మరణం సంభవించి 20 రోజులకుపైగానే అయింది. ఇప్పటికీ అభిమానులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. కర్ణిసేన, నటుడు శేఖర్ సుమన్ లాంటి వాళ్లు ఆన్లైన్ ఆఫ్లైన్ ఉద్యమాలను ఉధృతం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ముంబై పోలీసులు అనేక కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.