twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ రోజు రాత్రి ఇంట్లో లైట్లు ఆర్పేసి.. సుశాంత్ మృతికి ముందు ఏం జరిగిందంటే.. ప్రత్యక్షసాక్షి కథనం

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత మీడియాలో రకరకలా ఊహాగానాలు, అనుమానాలు, రిపోర్టులో వెలుగు చూస్తున్నాయి. అయితే రకరకాల వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ.. ఏ వార్తను నమ్మాలో లేదో అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఓ విషయం ముంబై మీడియాలో వైరల్ అవుతున్నది. సుశాంత్ మరణానికి ముందు రాత్రి ఇలా జరిగిందంటూ చక్కర్లు కొడుతున్న ఓ వార్త ఏమిటంటే..

    Recommended Video

    Sushant Singh Rajput మృతికి ముందు జూన్ 13 రాత్రి 10 నుంచి ఏం జరిగిందో చెప్పిన ప్రత్యక్షసాక్షి!!
    సుశాంత్ సింగ్ ఇంట్లో సహజానికి విరుద్ధంగా

    సుశాంత్ సింగ్ ఇంట్లో సహజానికి విరుద్ధంగా

    ముంబైలోని బాంద్రాలోని మౌంట్ బ్లాక్ భవనంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉండేవారు. అయితే ఆ భవనానికి ఇరుగు పొరుగు వ్యక్తి రిపబ్లిక్ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకు తెలిసి సుశాంత్ సింగ్ ఇంట్లో ఎప్పుడూ లైట్లు వెలుగుతూ ఉండేవి. నాకు తెలిసి ఏ ఒక్క క్షణం కూడా ఆర్పిన సందర్భాలు లేవు కానీ ఆ రోజు అంటే జూన్ 13వ తేదీ రాత్రి అందుకు విరుద్ధంగా జరిగింది అని చెప్పారు.

    లైట్లన్నీ ఆర్పేసి.. కిచెన్‌లో మాత్రమే

    లైట్లన్నీ ఆర్పేసి.. కిచెన్‌లో మాత్రమే

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి ముందు రోజు జూన్ 13 తేదీ రాత్రి 10.30 నుంచి 11 గంటల మధ్య ప్రాంతంలో లైట్లన్నీ ఆర్పేశారు. కేవలం కిచెన్‌లో మాత్రమే లైట్ వెలుగుతూ కనిపించింది. సుశాంత్ ఇంట్లో ఇలా ఎప్పుడూ జరుగలేదు. ప్రతీ రోజు లైట్లు వేసి ఉండేవి అని పక్కింటి వ్యక్తి పేర్కొన్నారు.

    అనుమానాస్పదంగా ఆ రోజు

    అనుమానాస్పదంగా ఆ రోజు

    సాధారణంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రతీ రోజు 3 నుంచి 4 గంటల వరకు మెలుకువగానే ఉండేవారు. ఆ రోజు ఇంట్లో పార్టీలు జరిగినట్టు కనిపించలేదు అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కానీ ఆ ఇంట్లో ఏదో అనుమానాస్పద సంఘటన చోటుచేసుకొందనే ఫీలింగ్ కలిగింది అంటూ తన అభిప్రాయాన్ని పొరుగింట్లో ఉండే వ్యక్తి చెప్పారు.

    సిద్ధార్థ్ పితాని ప్రశ్నించేందుకు సీబీఐ

    సిద్ధార్థ్ పితాని ప్రశ్నించేందుకు సీబీఐ

    సుశాంత్ మరణం తర్వాత ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ మాట్లాడుతూ.. ఆ ఘటనకు ముందు రోజు ఆ ఇంట్లో ఎలాంటి పార్టీ జరుగలేదు అని స్పష్టం చేశారు. ఆ రోజు ఇంట్లో ఉన్న సిద్ధార్థ్ పితాని, వంట మనషులను ప్రశించేందుకు ఇప్పుడు సిబీఐ సిద్దమవుతున్నది. ముంబై పోలీసుల విచారణలో వెలుగులోకి రాని విషయాలు సీబీఐ దర్యాప్తులో బయటకు వస్తాయో వేచి చూడాలి.

    సుశాంత్ ఇంట్లో డెత్ సీన్ రీ క్రియేట్ చేసిన సీబీఐ

    సుశాంత్ ఇంట్లో డెత్ సీన్ రీ క్రియేట్ చేసిన సీబీఐ

    సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ సుశాంత్ కేసును దర్యాప్తును శరవేగంగా మొదలుపెట్టింది. శనివారం ఐదు బృందాలుగా విడిపోయి పలు చోట్ల తమదైన శైలిలో విచారణ ప్రారంభించింది. ఐదు గంటలపాటు సుశాంత్ ఇంటిలో విచారణ మొదలుపెట్టింది. సుశాంత్ ఇంటిలో డేత్ సీన్ సీబీఐ అధికారులు రీ క్రియేట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    English summary
    Sushant Singh Rajput’s neighbour reveals that his home lights were unusually off on June 13th. Sushant’s neighbour at Mont Blanc building in Mumbai’s Bandra stated that there was something amiss on June 13, as the lights had been turned off, though he was known to be a night owl.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X