Don't Miss!
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ రోజు రాత్రి ఇంట్లో లైట్లు ఆర్పేసి.. సుశాంత్ మృతికి ముందు ఏం జరిగిందంటే.. ప్రత్యక్షసాక్షి కథనం
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత మీడియాలో రకరకలా ఊహాగానాలు, అనుమానాలు, రిపోర్టులో వెలుగు చూస్తున్నాయి. అయితే రకరకాల వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ.. ఏ వార్తను నమ్మాలో లేదో అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఓ విషయం ముంబై మీడియాలో వైరల్ అవుతున్నది. సుశాంత్ మరణానికి ముందు రాత్రి ఇలా జరిగిందంటూ చక్కర్లు కొడుతున్న ఓ వార్త ఏమిటంటే..
Recommended Video
సుశాంత్ సింగ్ ఇంట్లో సహజానికి విరుద్ధంగా
ముంబైలోని బాంద్రాలోని మౌంట్ బ్లాక్ భవనంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఉండేవారు. అయితే ఆ భవనానికి ఇరుగు పొరుగు వ్యక్తి రిపబ్లిక్ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకు తెలిసి సుశాంత్ సింగ్ ఇంట్లో ఎప్పుడూ లైట్లు వెలుగుతూ ఉండేవి. నాకు తెలిసి ఏ ఒక్క క్షణం కూడా ఆర్పిన సందర్భాలు లేవు కానీ ఆ రోజు అంటే జూన్ 13వ తేదీ రాత్రి అందుకు విరుద్ధంగా జరిగింది అని చెప్పారు.
లైట్లన్నీ ఆర్పేసి.. కిచెన్లో మాత్రమే
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి ముందు రోజు జూన్ 13 తేదీ రాత్రి 10.30 నుంచి 11 గంటల మధ్య ప్రాంతంలో లైట్లన్నీ ఆర్పేశారు. కేవలం కిచెన్లో మాత్రమే లైట్ వెలుగుతూ కనిపించింది. సుశాంత్ ఇంట్లో ఇలా ఎప్పుడూ జరుగలేదు. ప్రతీ రోజు లైట్లు వేసి ఉండేవి అని పక్కింటి వ్యక్తి పేర్కొన్నారు.
అనుమానాస్పదంగా ఆ రోజు
సాధారణంగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రతీ రోజు 3 నుంచి 4 గంటల వరకు మెలుకువగానే ఉండేవారు. ఆ రోజు ఇంట్లో పార్టీలు జరిగినట్టు కనిపించలేదు అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కానీ ఆ ఇంట్లో ఏదో అనుమానాస్పద సంఘటన చోటుచేసుకొందనే ఫీలింగ్ కలిగింది అంటూ తన అభిప్రాయాన్ని పొరుగింట్లో ఉండే వ్యక్తి చెప్పారు.
సిద్ధార్థ్ పితాని ప్రశ్నించేందుకు సీబీఐ
సుశాంత్ మరణం తర్వాత ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ మాట్లాడుతూ.. ఆ ఘటనకు ముందు రోజు ఆ ఇంట్లో ఎలాంటి పార్టీ జరుగలేదు అని స్పష్టం చేశారు. ఆ రోజు ఇంట్లో ఉన్న సిద్ధార్థ్ పితాని, వంట మనషులను ప్రశించేందుకు ఇప్పుడు సిబీఐ సిద్దమవుతున్నది. ముంబై పోలీసుల విచారణలో వెలుగులోకి రాని విషయాలు సీబీఐ దర్యాప్తులో బయటకు వస్తాయో వేచి చూడాలి.
సుశాంత్ ఇంట్లో డెత్ సీన్ రీ క్రియేట్ చేసిన సీబీఐ
సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ సుశాంత్ కేసును దర్యాప్తును శరవేగంగా మొదలుపెట్టింది. శనివారం ఐదు బృందాలుగా విడిపోయి పలు చోట్ల తమదైన శైలిలో విచారణ ప్రారంభించింది. ఐదు గంటలపాటు సుశాంత్ ఇంటిలో విచారణ మొదలుపెట్టింది. సుశాంత్ ఇంటిలో డేత్ సీన్ సీబీఐ అధికారులు రీ క్రియేట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.