Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ రోజు రాత్రి ఇంట్లో లైట్లు ఆర్పేసి.. సుశాంత్ మృతికి ముందు ఏం జరిగిందంటే.. ప్రత్యక్షసాక్షి కథనం
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత మీడియాలో రకరకలా ఊహాగానాలు, అనుమానాలు, రిపోర్టులో వెలుగు చూస్తున్నాయి. అయితే రకరకాల వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ.. ఏ వార్తను నమ్మాలో లేదో అనే అనుమానాలు వెంటాడుతున్నాయి. తాజాగా ఓ విషయం ముంబై మీడియాలో వైరల్ అవుతున్నది. సుశాంత్ మరణానికి ముందు రాత్రి ఇలా జరిగిందంటూ చక్కర్లు కొడుతున్న ఓ వార్త ఏమిటంటే..
Recommended Video
సుశాంత్ సింగ్ ఇంట్లో సహజానికి విరుద్ధంగా
ముంబైలోని బాంద్రాలోని మౌంట్ బ్లాక్ భవనంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఉండేవారు. అయితే ఆ భవనానికి ఇరుగు పొరుగు వ్యక్తి రిపబ్లిక్ టెలివిజన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తనకు తెలిసి సుశాంత్ సింగ్ ఇంట్లో ఎప్పుడూ లైట్లు వెలుగుతూ ఉండేవి. నాకు తెలిసి ఏ ఒక్క క్షణం కూడా ఆర్పిన సందర్భాలు లేవు కానీ ఆ రోజు అంటే జూన్ 13వ తేదీ రాత్రి అందుకు విరుద్ధంగా జరిగింది అని చెప్పారు.
లైట్లన్నీ ఆర్పేసి.. కిచెన్లో మాత్రమే
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి ముందు రోజు జూన్ 13 తేదీ రాత్రి 10.30 నుంచి 11 గంటల మధ్య ప్రాంతంలో లైట్లన్నీ ఆర్పేశారు. కేవలం కిచెన్లో మాత్రమే లైట్ వెలుగుతూ కనిపించింది. సుశాంత్ ఇంట్లో ఇలా ఎప్పుడూ జరుగలేదు. ప్రతీ రోజు లైట్లు వేసి ఉండేవి అని పక్కింటి వ్యక్తి పేర్కొన్నారు.
అనుమానాస్పదంగా ఆ రోజు
సాధారణంగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ ప్రతీ రోజు 3 నుంచి 4 గంటల వరకు మెలుకువగానే ఉండేవారు. ఆ రోజు ఇంట్లో పార్టీలు జరిగినట్టు కనిపించలేదు అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. కానీ ఆ ఇంట్లో ఏదో అనుమానాస్పద సంఘటన చోటుచేసుకొందనే ఫీలింగ్ కలిగింది అంటూ తన అభిప్రాయాన్ని పొరుగింట్లో ఉండే వ్యక్తి చెప్పారు.
సిద్ధార్థ్ పితాని ప్రశ్నించేందుకు సీబీఐ
సుశాంత్ మరణం తర్వాత ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్ మాట్లాడుతూ.. ఆ ఘటనకు ముందు రోజు ఆ ఇంట్లో ఎలాంటి పార్టీ జరుగలేదు అని స్పష్టం చేశారు. ఆ రోజు ఇంట్లో ఉన్న సిద్ధార్థ్ పితాని, వంట మనషులను ప్రశించేందుకు ఇప్పుడు సిబీఐ సిద్దమవుతున్నది. ముంబై పోలీసుల విచారణలో వెలుగులోకి రాని విషయాలు సీబీఐ దర్యాప్తులో బయటకు వస్తాయో వేచి చూడాలి.
సుశాంత్ ఇంట్లో డెత్ సీన్ రీ క్రియేట్ చేసిన సీబీఐ
సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ సుశాంత్ కేసును దర్యాప్తును శరవేగంగా మొదలుపెట్టింది. శనివారం ఐదు బృందాలుగా విడిపోయి పలు చోట్ల తమదైన శైలిలో విచారణ ప్రారంభించింది. ఐదు గంటలపాటు సుశాంత్ ఇంటిలో విచారణ మొదలుపెట్టింది. సుశాంత్ ఇంటిలో డేత్ సీన్ సీబీఐ అధికారులు రీ క్రియేట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.