Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కుర్ర హీరోతో ఫాంహౌస్కు వెళ్లిన హీరోయిన్.. కెమెరా కంట పడడంతో బుక్కైపోయారు
ప్రముఖ నిర్మాత కుమారుడు సుమంత్ అశ్విన్ నటించిన 'తూనీగా తూనీగా' అనే సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది రెహా చక్రవర్తి. ఈ సినిమా తర్వాత ఆమె నేరుగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత పలు టీవీ షోలకు కూడా హోస్ట్గా వ్యవహరించింది. వీటన్నింటి వల్ల ఆమె పెద్దగా హైలైట్ కాలేదు కానీ, ఓ హీరోతో ప్రేమాయణం నడిచి బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా ఈ జంట ఫాంహౌస్కు వెళ్లి కెమెరాల కంటికి చిక్కారట.
ధోనీతో డేటింగ్
రెహా చక్రవర్తి డేటింగ్ చేస్తున్న సుశాంత్ సింగ్ రాజ్పుత్తో. గతంలో ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియదు కానీ, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ‘ధోనీ: అన్టోల్డ్ స్టోరీ' వచ్చిన తర్వాత మాత్రం దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం అయిపోయాడు. ఆ తర్వాత ఎన్నో భారీ సినిమాలో అవకాశాలు దక్కించుకోవడంతో బాలీవుడ్లోని స్టార్ హీరోల సరసన చేరిపోయాడు. ఇప్పుడు ఇదే స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
లండన్లో ఫుల్ ఎంజాయ్
రెహా చక్రవర్తితో సుశాంత్ డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో మరో వార్త బీ టౌన్లో సంచలనం అవుతోంది. ఇటీవల ఈ జంట లడక్ టూర్ వెళ్లిందని, అక్కడ బాగా ఎంజాయ్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, జూలై 1న ఆమె పుట్టినరోజు సందర్భంగా సుశాంత్ డైమండ్ పెండెంట్ ఒకటి గిఫ్ట్గా ఇచ్చాడని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అంతేకాదు, ఆరోజున సుశాంతే ఆమెతో కేక్ కట్ చేయించాడన్న గుసగుసలూ వినిపించాయి.
బహిరంగంగానే చెప్పేశాడు
ఇటీవల తమ మధ్య ఉన్న బంధం గురించి సుశాంత్ ఓపెన్ అయ్యాడు. ఓ మీడియాతో మాట్లాడుతూ.. ‘మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. మా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాను. ఇదే విషయాన్ని రెహాతో సైతం చెప్పాను. ఆమె నిర్ణయం కోసం వేచి చూస్తున్నాను' అని వెల్లడించాడు. దీంతో సుశాంత్ చెప్పింది పెళ్లి గురించే అని అర్థం అయిపోయింది. అప్పుడు ఈ వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయింది.
ఫాంహౌస్కు వెళ్లారు
తాజాగా ఈ జంట మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దీనికి కారణం వీళ్లిద్దరూ కలిసి ఓ ఫాంహౌస్కు వెళ్లడమే. రెండు రోజుల క్రితం సుశాంత్ - రెహా చక్రవర్తి ముంబై శివారులోని ఓ ఫాంహౌస్కు వెళ్లారట. ఆ రాత్రి మొత్తం అక్కడే ఉన్నారట. తిరిగి వచ్చే క్రమంలో ఇద్దరూ కెమెరాల కంటికి చిక్కారని తెలిసింది. ఈ వార్త తాజాగా బయటకు రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.