Don't Miss!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సుస్మితా సేన్కు విషాదం.. బాలీవుడ్లో మరో సూసైడ్.. అనుమానాస్పదంగా..
మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితాసేన్ విషాదంలో మునిగిపోయారు. ఆమెకు అత్యంత సన్నిహితుడు, కళాకారుడు రామ్ ఇంద్రనీల్ కామత్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం బాలీవుడ్ ప్రముఖులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తున్నది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం నుంచి ఇంకా కోలుకోకముందే బాలీవుడ్లో మరో సూసైడ్ చోటుచేసుకోవడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామత్ మరణం గురించి వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్ ప్రముఖులకు సన్నిహితుడు
ముంబైకి చెందిన ప్రముఖ పెయింటర్, బాలీవుడ్ ప్రముఖులకు అత్యంత సన్నిహితుడు రామ్ ఇంద్రనీల్ కామత్ మాతుంగ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లోని బాత్రూం టబ్లో అనుమానాస్పద పరిస్థితుల్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మరణించారు. ఆయన బాత్రూంలో పడి ఉండటాన్ని చూసి తల్లి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు.
బాత్రూంలో విగతజీవిగా
బాత్రూంలో విగత జీవిగా పడి ఉన్న రామ్ ఇంద్రనీల్ కామత్ను చూసి తల్లి సమాచారం అందించడంతో ఆయనను సమీపంలోని సియాన్ హాస్పిటల్కు తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించారనే విషయాన్ని వైద్యులు ధృవీకరించారు. ఈ అనుమానాస్పద మరణాన్ని యాక్సిడెంటల్ డెత్గా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మతుంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కొద్ది రోజులుగా మానసిక వ్యాధితో
గత కొద్దిరోజులుగా కామత్ మానసిక రుగ్మతతో బాధపడుతూ చికిత్స పొందున్నారని సన్నిహితులు వెల్లడించారు. అయితే చికిత్స తర్వాత పూర్తిగా కోలుకొన్నారా అనే విషయంపై క్లారిటీ లేదని పేర్కొంటున్నారు. కామత్ మరణం వెనుక ఏదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పోస్టు మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నారు.
Recommended Video
మహాలక్ష్మి పుత్రుడినంటూ ..
ప్రముఖ పెయింటర్గా గుర్తింపు పొందిన రామ్ ఇంద్రనీల్ కామత్ బాలీవుడ్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తనకు తాను మహాలక్ష్మి పుత్రుడిగా చెప్పుకొంటారు. పురాణ కథల నేపథ్యంతో ఆయన వేసిన క్యాలెండర్లు అంత్యంత ప్రజాదరణ పొందాయి. గ్లాస్ వర్క్ పెయింటర్గా, ఫొటోగ్రాఫర్గా కామత్ సుపరిచితులు.