Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
తాప్సి సినిమాని బ్యాన్ చేసిన పాకిస్తాన్.. కారణం ఇదే!
పలు బాలీవుడ్ చిత్రాలు పాకిస్తాన్ లో తరచుగా బ్యాన్ కు గురవుతున్నాయి. సీనియర్ నటుడు రిషి కపూర్, తాప్సి ప్రధాన పాత్రల్లో నటించిన 'ముల్క్' చిత్రం నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. పాక్ లో మాత్రం ఈ చిత్రం విడుదుల కాలేదు. వివిధ రకాల కారణాలు చెబుతూ అధికారులు ఈ చిత్రాన్ని బ్యాన్ చేసారు. పాక్ ప్రభుత్వ చర్యపై దర్శకుడు అనుభవ్ సిన్హా మండిపడుతున్నారు.
ఇస్లాం ఫోబియా అనే పాయింట్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అందువలనే పాక్ ప్రభుత్వం ఈ చిత్రాన్ని బ్యాన్ చేసింది. దీనిపై అనుభవ్ సిన్హా స్పందించారు. ఈ చిత్రం ముస్లింలకు వ్యతిరేకంగానో, అనుకూలంగానే తెరకెక్కించిన చిత్రం కాదు. ఈ చిత్రం మన చుట్టూ జరిగే అంశాల గురించి, ప్రేమ గురించి చెప్పే చిత్రం.
ఈ సందర్భంగా పాక్ ప్రేక్షకులని ఉద్దేశించి కూడా అనుభవ్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రేక్షకులని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ చిత్రాన్ని పాక్ ప్రభుత్వం ఎందుకు బ్యాన్ చేసింది. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు మీకు ఈ చిత్రం చూసే అవకాశం కలుగుతుంది. అప్పుడు చెప్పండి మీ ప్రభుత్వం ఈ చిత్రాన్ని ఎందుకు బ్యాన్ చేసిందో అని అనుభవ సింగ్ ట్వీట్ చేసారు.