Don't Miss!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
హీరో భార్య బ్యాక్లెస్ ఫోటో: వీపుపై మచ్చ చూపించడం కష్టంగా ఉందంటూనే...
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య తాహిరా కశ్యప్ను కేన్సర్ ఏమాత్రం కృంగదీయలేదు. 'మనల్ని మనం ప్రేమించుకోవాలి' అంటూ ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా ఆమె తన అభిమానులు, ఫాలోవర్స్ను ఉద్దేశించి ఓ సందేశం ఇస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఆమె పైన ఎలాంటి ఆచ్చాదన లేకుండా వీపు చూపిస్తూ కనిపించారు. తాహిరా వీపుపై ఉన్న ఒక పెద్ద మచ్చ... ప్రతి ఒక్కరి షాకయ్యేలా చేసింది. రొమ్ము కేన్సర్ సర్జరీ చేయడం వల్ల ఆ మచ్చ ఏర్పడింది.
ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్న తాహిరా ఇన్స్టా పోస్ట్
అందరికీ ప్రపంచ కేన్సర్ దినోత్సవ శుభాకాంక్షలు. నాలాంటి వారంతా ఈ రోజును స్వీకరిస్తూ సెలబ్రేట్ చేసకుంటారని నమ్ముతున్నాను. కేన్సర్ చికిత్స తీసుకునే క్రమంలో మన శరీరంలో కొన్ని ఊహించని మార్పులు జరుగుతాయి. ఏది ఏమైనా మనల్ని మనం ప్రేమించుకోవాలనే చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాల్సిన అవసరం ఉంది. నా శరీరంపై ఏర్పడిన మచ్చలను నాకు లభించిన పతకాలుగా స్వీకరిస్తున్నాను. ఇంతకంటే పెర్ఫెక్ట్ నిర్ణయం ఏమీ ఉండదు.. అని తాహిరా వ్యాఖ్యానించారు.
ఆ మచ్చ చూపించడం కష్టంగా ఉండేది
తన శరీరంపై ఏర్పడిన మచ్చను ప్రపంచానికి చూపించడం కష్టంగా ఉండేదని ఈ సందర్భంగా తాహిరా చెప్పుకొచ్చారు. కానీ ఈ ఫోటో పోస్టు చేయడం వెనక నా ఉద్దేశ్యం నాకు సోకి వ్యాధిని సెలబ్రేట్ చేసుకోవడం కాదు, దాని వల్ల నేను పొందిన స్పిరిట్ను సెలబ్రేట్ చేసుకోవడమే అని తెలిపారు.
అజేయమైన జీవితాన్ని గడపడమే శాశ్వత విజయం
ఈ సందర్భంగా ఆమె బౌద్ధ తత్వవేత్త వ్యాఖ్యలను ప్రస్తావించారు. అజేయమైన జీవితాన్ని గడపడమే ఒక శాశ్వత విజయం. ఎప్పుడూ ఓటమిని అంగీకరించరాదు... గెలవడం కంటే పోరాడటమే విజయం కంటే గొప్పది. అది మనలో సవాలును పెంచుతుంది. చాలా సార్లు మనం కింద పడిపోతాం, ఆ సమయంలో మనం మళ్లీ పైకి లేచి ముందుకు ఒక అడుగు వేయడం ఎంతో ముఖ్యం, వీలు కాకపోతే సగం అడుగైనా ముందుకు వేయాలి అని వ్యాఖ్యానించారు.
దర్శకత్వం వైపు
తాహిరా కశ్యప్ త్వరలో దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.