Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘‘ఆ హీరోయిన్ లెస్బియన్, నా మర్మాంగాలు టచ్ చేసింది... ఆపై రేప్’’
సెన్సేషనల్ స్టేట్మెంట్లతో ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ ఐటం గర్ల్ రాఖీ సావంత్ ఈ సారి తనుశ్రీ దత్తా మీద ఆరోపణలు చేశారు. తనుశ్రీ దత్తా లెస్బియన్ అని, ఆమె తనను రేప్ చేసింది అంటూ వ్యాఖ్యానించింది. #మీటూ ఉద్యమం నేపథ్యంలో రాఖీ సావంత్, తనుశ్రీ మధ్య లీగల్ ఫైట్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాఖీ ఈ సంచలన ఆరోపణలు చేశారు.
పూర్తిగా ట్రెడిషనల్ దుస్తుల్లో మీడియా ముందుకు వచ్చిన రాఖీ సావంత్.... తనుశ్రీ దత్తా తనను పలు సార్లు రేప్ చేసినట్లు ఆరోపించింది. అంతే కాదు...తనుశ్రీ దత్త స్త్రీ అయినప్పటికీ ఆమెలో పురుషుడి లక్షణాలు ఉన్నాయని ఆరోపించింది.
డ్రగ్స్ కూడా తీసుకునేది
12 సంవత్సరాల క్రితం తనుశ్రీ దత్తా తనకు బెస్ట్ ఫ్రెండ్గా ఉండేదని, ఆ సమయంలో తనను రేవ్ పార్టీలకు తీసుకెళ్లేదని రాఖీ సావంత్ ఆరోపించారు. ఆ సమయంలో ఆమె డ్రగ్స్ తీసుకునేదని, తనకు కూడా డగ్స్ అలవాటు చేసిందని ఆరోపించారు. ఆ సమయంలో ఆమె తన ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేసేదని, ఆపై రేప్ చేసేదని ఆరోపించింది.
ఇండస్ట్రీలో చాలా మంది లెస్బియన్స్
బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది లెస్బియన్స్ ఉన్నారని, అయితే తనుశ్రీ తనకు వ్యతిరేకంగా కేసు వేయడం వల్లనే ఆమె పేరు బయట పెట్టినట్లు రాఖీ సావంత్ వ్యాఖ్యానించారు. రాఖీ సావంత్ చేసిన కామెంట్స్ బాలీవుడ్లో సంచలనం అయ్యాయి.
తనుశ్రీ దత్తా సంఘటనతో మీటూ ఉధృతం
మీటూ ఉద్యమంలో భాగంగా తనుశ్రీ దత్తా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పదేళ్ల క్రితం ‘హార్న్ ఓకే ప్లీజ్' సినిమా షూటింగులో నానా పాటేకర్ తనపట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన తర్వాత బాలీవుడ్ మీటూ ఉద్యమం మరింత బలపడింది.
తనుశ్రీ వర్సెస్ రాఖీ
ఈ వ్యవహారంలో నానా పాటేకర్కు మద్దతుగా రాఖీ సావంత్ మాట్లాడారు. కేవలం పబ్లిసిటీ కోసమే తనుశ్రీ దత్తా ఇలాంటి ఆరోపణలు చేసిందని పేర్కొన్నారు. దీంతో రాఖీ మీద తనుశ్రీ దత్తా రూ. 10 కోట్ల పరువు నష్టం దావా వేసింది.
రాఖీ సావంత్ ఎదురుదాడి
తనుశ్రీ దత్తా తనపై పరువు నష్టం దావా వేయడంతో రాఖీ సావంత్ మీడియా ముందుకు వచ్చింది. తనుశ్రీ దత్తా తనను లోక్లాస్ గర్ల్ అని పిలిచినందుకు ఆమెపై రూ. 50 కోట్ల పరువు నష్టం దావా వేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పుడేమో ఆమెపై ఏకంగా లెస్బియన్, రేప్ అంటూ ఆరోపణలు చేయడం గమనార్హం.