Don't Miss!
- News ద్రోణి ప్రభావం: ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన; అన్నదాతల ఆందోళన!!
- Finance Stock Market: ఎన్నికల ముందు మార్కెట్లలో అలజడి.. కుప్పకూలిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Sports ముంబయి ఇండియన్స్కు కొత్త బౌలర్ వచ్చాడు
- Automobiles కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఆ ఇద్దరితో పోలిస్తే నా టాలెంట్ తక్కువే, లక్కుతో నెట్టుకొస్తున్నా: స్టార్ హీరో హాట్ కామెంట్
బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఖాన్ త్రయంలో సల్మాన్ ఖాన్ ఎక్కువ పాపులరిటీతో పాటు సక్సెస్ సొంతం చేసుకున్నారు. అయితే సల్మాన్ ఖాన్ మాత్రం తనకంటే షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ ఎక్కువ టాలెంట్ ఉన్న స్టార్స్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. టాలెంట్ విషయంలో తాను అంతంత మాత్రమే అని, ఏదో అదృష్టం కలిసి రావబట్టే తన సినిమాలు బాగా ఆడుతున్నట్లు తెలిపారు. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ ఇద్దరూ లెజెండ్స్... కేవలం ఒకటి, రెండు ప్లాపులు వారికి స్టార్ ఇమేజ్ పడిపోవడానికి కారణం కావు అని సల్లూ భాయ్ చెప్పుకొచ్చారు.
అంతా దేవుడి దయవల్లే..
‘దేవుడి దయ వల్ల నేను ఎంచుకున్న సినిమాలు బాగా ఆడాయి. అలా అని షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ చెత్త చిత్రాలు ఎంచుకున్నారని అనడం లేదు. నేను ఎంచుకున్న కొన్ని సినిమాలు బాక్సాఫీసు వద్ద ప్లాపైన సందర్భాలు కూడా ఉన్నాయి. వరుస సినిమాలు ఆడక పోయినా... ఒక సినిమా హిట్టు పడితే మనం ఫాంలోకి రావచ్చు. షారుక్ ఖాన్ లెజెండ్.. అమీర్ కూడా అంతే. వారు కొన్ని బ్యాడ్ చిత్రాలు చేసి ఉండొచ్చు. కానీ వాళ్లు తిరిగి ఫాంలోకి వచ్చే సత్తా ఉన్న స్టార్స్. అసలైన టెన్షన్ నాకు ఉంటుంది. అమీర్, షారుక్ టాలెంట్ ఉన్నవారు. వారితో పోలిస్తే నాకు అంత సీన్ లేదు' అని సల్మాన్ ఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
అభిమానులు, అదృష్టం వల్లే
తాను ఇంతకాలం ఇండస్ట్రీలో సర్వైవ్ కావడానికి కారణం అదృష్టంతో పాటు... జెన్యూన్ ఫ్యాన్ బేస్ ఉండటమే అని 53 ఏళ్ల సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. నన్ను అభిమానించే వారు ఇంత ఎక్కువగా ఉన్నారంటే అదంతా దేవడి దయ అని సల్మాన్ పేర్కొన్నారు.
సల్లూభాయ్ చివరి చిత్రం బిగ్ ప్లాప్
సల్మాన్ ఖాన్ నటించిన చివరి చిత్రం ‘రేస్ 3' బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అయన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీసు వద్ద రూ. 150 కోట్లు వసూలు చేయడంలో సక్సెస్ అయింది. త్వరలో సల్లూ భాయ్... అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ‘భారత్' అనే చిత్రం చేస్తున్నారు.
భారత్
కొన్ని రోజుల క్రితం ‘భారత్' చిత్రానికి సంబంధించిన టీజర్ విడులవ్వగా... మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈద్ సందర్బంగా జూన్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.