Don't Miss!
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
అమితాబ్- అమీర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ కోసం 2 లక్షల కిలోల...
Recommended Video
ఇండియాలో సినిమా నిర్మాణ రంగంలో చాలా మార్పులు వస్తున్నాయి. బాహుబలి మూవీ తర్వాత ఫిల్మ్ మేకర్స్ ఆలోచన పూర్తిగా మారిపోయింది. సినిమా క్వాలిటీ ప్రపంచ స్థాయిని అందుకునేలా ఎంతటి ఖర్చు పెట్టడానికైనా వెనకాడటం లేదు నిర్మాతలు. మంచి క్వాలిటీతో సినిమా అందిస్తే మంచి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చనేది తేలిపోయింది.
ప్రస్తుతం బాలీవుడ్లో ప్రముఖ స్టార్స్ అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమా కోసం రెండు భారీ నౌకల సెట్స్ వేస్తున్నారు. ఈ సెట్స్కు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సెట్స్ బరువు సుమారు 2 లక్షల కిలోలు ఉంటుందట.
యూరఫ్ తీరంలో సెట్స్
సినిమా కథకు ఈ రెండు సెట్లు ఎంతో కీలకం కావడం వల్లనే భారీగా ఖర్చు పెట్టి మరీ ఇదంతా చేస్తున్నారట. ఈ సెట్స్ నిర్మాణంలో ఇంటర్నేషనల్ డిజైనర్స్, షిప్ మేకర్స్ తో సహా 1000 మంది సంవత్సరం పాటు కష్టపడ్డారట. యూరఫ్లోని మెల్టా అనే తీర ప్రాంతంలో ఈ సెట్స్ వేశారు.
యశ్ రాజ్ ఫిలింస్
ఈ మూవీలో ఆమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ తో పాటు కత్రినా కైఫ్, ఫాతిమా సనా షేక్ తదిరులు నటిస్తున్నారు. ఈ యాక్షన్ అడ్వెంచరస్ చిత్రానికి ‘ధూమ్ 3' ఫేం విజయ్కృష్ణ ఆచార్య దర్శకుడు. ఇండియాలో టాప్ ఫిల్మ్ మేకింగ్ సంస్థ యష్రాజ్ ఫిలింస్ బేనర్లో ఈ చిత్రం రూపొందుతోంది.
స్టోరీ ఏమిటంటే..
19వ శతాబ్దం తొలినాళ్లలో భారతదేశంలో దోపిడీ కార్యకలాపాలతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన థగ్గుల కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 1839లో వచ్చిన ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్' అనే నవల ఈ సినిమా కథకు మూలాధారం.
సరికొత్త అనుభూతి
ఈ సినిమా హాలీవుడ్ సినిమాల స్థాయిలో అద్భుతమైన విజువల్స్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని తెలుస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలో ఇదో గొప్ప, భారీ సినిమా కాబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా షిప్స్పై చిత్రీకరించే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులు ఆశ్చర్యపోవడం ఖాయం అంటున్నారు. ఈ ఏడాది నవంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.