Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోను పీకల్లోతు ముంచేసి... పొలిటికల్ టైగర్ మనవడితో దిశా పటానీ అఫైర్
బాలీవుడ్ అందాల భామ దిశా పటానీపై వచ్చే గాసిప్స్ కొదువేం లేదు. ఇటీవల కాలంలో జాకీ ష్రాఫ్ తనయుడు హీరో టైగర్ ష్రాఫ్తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే వారిద్దరిలో ఎవరూ కూడా తమ అఫైర్ను ధృవీకరించలేదు. కాకపోతే విదేశీ విహారాలకు వెళ్లడం, ముంబైలోని హోటళ్లలో లంచ్ డేట్స్, డిన్నర్ డేట్స్తో దడదడలాడించారు. అయితే వారి మధ్య ఏదో చెప్పలేని వ్యవహారం నడుస్తున్నదని అందరూ అనుమానించారు. అయితే దిశా, టైగర్కు సంబంధించిన ఓ వార్త మీడియాలో హల్చల్ చేస్తున్నది. ఆ వార్త గురించి వివరాల్లోకి వెళితే..
టైగర్ ష్రాఫ్తో బ్రేకప్ వార్త
దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ మధ్య రిలేషన్స్ అంతగా సరిగా లేవు. వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. కొద్ది వారాలుగా వారిద్దరూ ఎడమొగం, పెడమొగంగా ఉంటున్నారు. కొద్దికాలంగా విడిపోదామని అనుకొంటున్నారు. కానీ ఇటీవల వారిద్దరి తమ అఫైర్కు బ్రేకప్ చెప్పారు అని సన్నిహితులు, స్నేహితులు పేర్కొన్నారు. ఇండస్ట్రీలో కూడా వీరిద్దరి రిలేషన్పై భారీగానే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఓదారుస్తున్న స్నేహితులు
దిశా పటానీ, టైగర్ ష్రాఫ్ బ్రేక్ గురించి బాలీవుడ్కు చెందిన ప్రముఖ పత్రిక కూడా ధృవీకరించింది. పరస్పర అంగీకారంతో వారిద్దరు విడిపోయారు. కొద్దివారాల క్రితం ఇది జరిగింది. బ్రేకప్ తర్వాత వారిద్దరూ మానసికంగా కుంగిపోయారు. వారిని ఓదార్చేందుకు స్నేహితులు, సన్నిహితులు రావడం జరుగుతున్నది అని ఓ కథనం వెలువడింది.
థాక్రే మనవడి చిచ్చు పెట్టడంతో
టైగర్ ష్రాఫ్, దిశా పటానీ విడిపోవడం వెనుక ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. స్వర్గీయ బాల్ థ్రాకే మనవడు ఆదిత్య థాక్రేతో అఫైర్ కొనసాగించడమే వీరిద్దరి బ్రేకప్ కారణం. కొద్దికాలంగా ఆదిత్యతో చాలా సన్నిహితంగా ఉంటున్నది. ఈ విషయంపై వారిద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకొన్నాయి. దాంతో తమ మధ్య ఉన్న రిలేషన్ను బ్రేక్ చేసుకొన్నారు. కానీ వారిద్దరు స్నేహంగానే ఉండాలని నిర్ణయించుకొన్నారు అని ఓ రూమర్ ప్రచారంలో ఉంది.
విడిపోయినా.. స్నేహంగానే ఉంటూ
బ్రేకప్ తర్వాత డిన్నర్ డేట్లో దిశా పటానీ, టైగర్ కనిపించడం చర్చనీయాంశమైంది. దాంతో అసలు విషయమేటని ఆరా తీయగా.. వారిద్దరూ విడిపోయింది నిజమే. స్నేహంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారు. వారి మానసిక పరిణతికి అది సాక్ష్యమని సన్నిహితులు, స్నేహితులు వెల్లడించారు. ఇక వారిద్దరూ కెరీర్పైనే దృష్టిపెట్టాలని అనుకొంటున్నారని పేర్కొన్నారు.