Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరణించిన బాయ్ఫ్రెండ్ను గుర్తు చేసుకొని.. స్టార్ హీరో కూతురు కన్నీరు
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కుమార్తె త్రిశాల దత్ విషాదం నుంచి ఇప్పట్లో బయటపడే సూచనలు కనిపించడంలేదు. గత నెల అంటే జూలై 2 తేదీన త్రిశాల బాయ్ఫ్రెండ్, ఇటలీకి చెందిన వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. గత నెల రోజుల నుంచి తన ప్రియుడి మరణంతో షాక్లో తాజాగా సోషల్ మీడియాలో ఎమోషనల్ లేఖ రాసింది. ఆమె రాసిన లేఖ ప్రతీ ఒక్కరికి ఉద్వేగానికి గురిచేసేలా ఉంది.
నీ మరణంతో నా హృదయం ముక్కలైంది. నన్ను సంరక్షించుకొన్న తీరు, నాకు కవచంలో నిలిచిన తీరు, ప్రేమించిన తీరుకు థ్యాంక్స్. నా జీవితంలో ప్రతీ క్షణం సంతోషంలో మునిగి తేలేటట్టు చేశావు. నీలాంటి వ్యక్తిని కలిసినందుకు ఈ ప్రపంచంలోనే అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. విశాల ప్రపంచంలో నన్ను వదిలి వెళ్లావు అని త్రిశాల ఓ లేఖను పోస్టు చసింది.
నెలరోజులు గడిచిపోయినా తన బాయ్ఫ్రెండ్ మెమొరీస్లోనే గడుపుతున్నారు. అతని జాపకాల నుంచి బయటపడలేకపోతున్నారు. ఆ క్రమంలోనే ఐ లవ్ యూ.. ఐ మిస్ యూ అంటూ కాప్షన్ పెట్టి ఓ పోస్టు చేశారు.
కొద్దిరోజుల క్రితం కూడా స్నేహితురాలి పెళ్లికి హాజరైన సమయంలో ఓ భావోద్వేగమైన లేఖను కూడా రాసింది. నన్ను చుట్టుముట్టిన బాధల నుంచి బయటపడేందుకే ఈ పెళ్లికి హాజరయ్యానని చెప్పింది. ఈ సందర్భంగా కూడా తను లేకపోవడం, ఆయనను కోల్పోవడం జీవితంలో తీరని లోటు అని పేర్కొన్నది.