Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మరణించిన బాయ్ఫ్రెండ్ను గుర్తు చేసుకొని.. స్టార్ హీరో కూతురు కన్నీరు
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కుమార్తె త్రిశాల దత్ విషాదం నుంచి ఇప్పట్లో బయటపడే సూచనలు కనిపించడంలేదు. గత నెల అంటే జూలై 2 తేదీన త్రిశాల బాయ్ఫ్రెండ్, ఇటలీకి చెందిన వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. గత నెల రోజుల నుంచి తన ప్రియుడి మరణంతో షాక్లో తాజాగా సోషల్ మీడియాలో ఎమోషనల్ లేఖ రాసింది. ఆమె రాసిన లేఖ ప్రతీ ఒక్కరికి ఉద్వేగానికి గురిచేసేలా ఉంది.
నీ మరణంతో నా హృదయం ముక్కలైంది. నన్ను సంరక్షించుకొన్న తీరు, నాకు కవచంలో నిలిచిన తీరు, ప్రేమించిన తీరుకు థ్యాంక్స్. నా జీవితంలో ప్రతీ క్షణం సంతోషంలో మునిగి తేలేటట్టు చేశావు. నీలాంటి వ్యక్తిని కలిసినందుకు ఈ ప్రపంచంలోనే అదృష్టవంతురాలిగా భావిస్తున్నాను. విశాల ప్రపంచంలో నన్ను వదిలి వెళ్లావు అని త్రిశాల ఓ లేఖను పోస్టు చసింది.
నెలరోజులు గడిచిపోయినా తన బాయ్ఫ్రెండ్ మెమొరీస్లోనే గడుపుతున్నారు. అతని జాపకాల నుంచి బయటపడలేకపోతున్నారు. ఆ క్రమంలోనే ఐ లవ్ యూ.. ఐ మిస్ యూ అంటూ కాప్షన్ పెట్టి ఓ పోస్టు చేశారు.
కొద్దిరోజుల క్రితం కూడా స్నేహితురాలి పెళ్లికి హాజరైన సమయంలో ఓ భావోద్వేగమైన లేఖను కూడా రాసింది. నన్ను చుట్టుముట్టిన బాధల నుంచి బయటపడేందుకే ఈ పెళ్లికి హాజరయ్యానని చెప్పింది. ఈ సందర్భంగా కూడా తను లేకపోవడం, ఆయనను కోల్పోవడం జీవితంలో తీరని లోటు అని పేర్కొన్నది.