Don't Miss!
- News స్కాట్లాండ్లో ట్రెక్కింగ్ కోసం వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సైఫ్ నీ భార్య బికినీలో.. సిగ్గు అనిపించడం లేదా? కరీనా ఘాటైన జవాబు!
సినీతారలకు సోషల్ మీడియా ఎంత మంచిగా వెసులుబాటు కలిగించిందనే విషయం పక్కన పడితే.. దాని వల్ల అడపాదడపా సమస్యలు ఎదురవుతున్నాయి. సోషల్ మీడియాలో నియంత్రణ లేకపోవడం కరీనాకు తాజాగా నెటిజన్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. తనను ఉద్దేశించి దారుణమైన కామెంట్లకు గట్టిగా స్పందించింది. నెటిజన్కు ఎలా బుద్ది చెప్పిందో చూడండి..
ఆంటీ.. నీ వయసుకు తగ్గ డ్రస్ వేసుకో.. కరీనాను దారుణంగా.. బాత్రూం ఫోటోలు కూడా షేర్!
సైఫ్ అలి ఖాన్పై దారుణంగా ట్రోలింగ్
అర్బాజ్ ఖాన్ చాట్ షోకు హాజరైన కరీనా కపూర్ తనపై వచ్చిన ట్రోల్ను చదివింది. సైఫ్ ఆలీ ఖాన్ నీకు చచ్చి నరకానికి పోవాలని అనిపించడం లేదా? నీ భార్య చెండాలంగా బికినీ ధరించడం నీకు ఏ మాత్రం సిగ్గు అనిపించడం లేదా అని నెటిజన్ చేసిన కామెంట్పై కరీనా బదులిచ్చింది.
బికినీ వేసుకోవద్దని చెప్పడు
బికినీ వేసుకోవడం నాకు సంబంధించిన విషయం. ఆ విషయంలో నన్ను ఆపడానికి సైఫ్ ఎవరు? బికినీ వేసుకోవద్దని చెప్పడానికి ఆయన ఎవరు? అలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అని సైఫ్ నాకు చెప్పడు. అలాంటి రిలేషన్ మా మధ్య లేదు. మా మధ్య బాధ్యతాయుతమైన బంధం ఉంది. అంతకంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉంది అని కరీనా చెప్పింది.
నీళ్లలో మునిగేటప్పుడు బికినీ వేసుకోకపోతే
సముద్ర తీరంలో ఉన్నప్పుడు బికినీ వేసుకోకపోతే మరోకటి వేసుకొంటారా? నీళ్లలో మునిగేటప్పడు చీర కట్టుకోమంటావా. ఒకటి వ్యక్తిగతమైన విషయాల్లో మీకు తలదూర్చే హక్కు ఎక్కడిది అంటూ కరీనా ఘాటుగా స్పందించింది.
గుడ్ న్యూస్లో కరీనా కపూర్
ఇక కరీనా కెరీర్ విషయానికి వస్తే, రాజ్ మెహతా దర్శకత్వం వహించే గుడ్ న్యూస్ అనే చిత్రంలో అక్షయ్ కుమార్కు జంటగా నటిస్తున్నది. ఈ చిత్రం సెప్టెంబర్ 6న రిలీజ్ కానున్నది. ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్, కైరా అద్వానీ కీలక పాత్రలను పోషిస్తున్నారు.