స్టార్ హీరోకు అనారోగ్యం.. వయాగ్రా ఎక్కువ మోతాదులో తీసుకోవడంతో!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు పరిచయం అక్కర్లేదు. 50 ఏళ్ల వయసు దాటిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్గా అయిన సల్లూ భాయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే పఠాన్ మూవీలో అదిరిపోయే కెమియే చేసిన సల్మాన్ ఖాన్ 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం టైగర్ 3 చిత్రీకరణలో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా సల్మాన్ ఆరోగ్యానికి సంబంధించిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
కోట్లలో కలెక్షన్స్..:బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాల పరంగా దూసుకుపోతున్నాడు. ఇటీవలే పఠాన్ సినిమాలో టైగర్ గా షారుక్ ఖాన్ తో కలిసి అదిరిపోయే కెమియే ఇచ్చిన సల్లూ భాయ్ తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలైన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' మూవీకి టాక్ సంగతి ఎలా ఉన్న కోట్లలో కలెక్షన్స్ ను తెచ్చిపెట్టింది.

అన్నయ్యగా:పాన్ ఇండియా సినిమాగా వచ్చిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రధాన హీరోయిన్ గా చేసింది. అంతేకాకుండా విక్టరీ వెంకటేష్, భూమిక కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతో బిగ్ బాస్ బ్యూటి షెహనాజ్ గిల్ వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఇందులో పూజా హెగ్డెకు వెంకటేష్ అన్నయ్య పాత్ర పోషించగా సీనియర్ హీరో జగపతి బాబు విలన్ గా ఆకట్టుకున్నాడు.
స్పెషల్ అట్రాక్షన్:పవన్ కల్యాణ్ కాటమరాయుడు సినిమాకు హిందీ రీమెక్ గా వచ్చిన 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాలో ఒక పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ది మోస్ట్ బ్యూటిఫుల్ కత్రీనా కైఫ్ హీరోయిన్ గా చేస్తోంది. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ వీడియోకు మంచి స్పందన లభించింది.

హీరోయిన్లతో ప్రేమాయణం:సల్మాన్ ఖాన్ టైగర్ 3లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా నటిస్తున్నాడు. వీరిద్దరితో అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరించారట. దానికోసం ఏకంగా రూ. 35 కోట్లు ఖర్చు చేశారని టాక్. ఇక సల్మాన్ ఖాన్ సినిమాల సంగతి ఎలా ఉన్నా గతంలో ఆయన నడిపిన ప్రేమయాణాల సంగతి తెలిసిందే. అనేక మంది హీరోయిన్లల లవ్ అఫైర్ నడిపించిన సల్లూ భాయ్ చివరికీ మాత్రం బ్యాచిలర్ గానే మిగిలిపోయాడు.

బ్రేకింగ్ న్యూస్:బాలీవుడ్ బ్యాడ్ బాయ్ గా కూడా సల్మాన్ ఖాన్ పేరు తెచ్చుకున్నాడు. అలాంటి సల్మాన్ ఖాన్ పై తాజాగా సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమర్ సంధు షాకింగ్ ట్వీట్ చేశాడు. "బ్రేకింగ్ న్యూస్.. సల్మాన్ ఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం బాగోలేదు. గత రాత్రి అధిక మోతాదులో వయాగ్రా తీసుకున్నాడు. అప్పటి నుంచి అతని ఆరోగ్యం దెబ్బతింది" అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











