Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన బాలీవుడ్ బ్యూటీ
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ టాలీవుడ్లో మొదలై కోలీవుడ్, బాలీవుడ్ వరకు పాకింది. రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇలా దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇప్పటికే రెండు దశల్లొ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతమవ్వగా.. ఈ మధ్యే మూడో దశ గ్రీన్ఇండియా ఛాలెంజ్ను ప్రభాస్ చేత ప్రారంభించారు. ప్రభాస్ ప్రారంభించిన ఈ మూడో దశ ఫుల్ వైరల్ అవుతోంది.
దాదాపు తెలుగు సినీ ప్రముఖులందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్వీకరించారు. మొక్కలు నాటి.. మరో ముగ్గురికి సవాల్ కూడా విసిరారు. అలా ఈ సవాల్ మహేష్ బాబు వల్ల కోలీవుడ్కు చేరుకుంది. మహేష్ బాబు విసిరిన ఛాలెంజ్ను దళపతి విజయ్ స్వీకరించాడు. ఇక డైరెక్టర్ సంపత్ నంది విసిరిన ఛాలెంజ్ను బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా స్వీకరించింది. ఈ మేరకు మొక్కలు నాటిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ మేరకు తనను గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగస్వామ్యం చేసినందుకు ఊర్వశీ ఎంతో సంతోషించింది. తనకు సవాల్ విసిరినందుకు సంపత్ నందికి థ్యాంక్స్ తెలిపింది. ఈ ఛాలెంజ్ను ముందుకు తీసుకువెళ్తున్నందుకు మహేష్ బాబు, ప్రభాస్, దళపతి విజయ్లకు థ్యాంక్స్ చెప్పింది. ఏది ఏమైనా ఊర్వశీ మాత్రం దక్షిణాది హీరోలపై ప్రశంసలు కురిపిస్తూ.. ఇక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది.