Just In
- 7 min ago
బెడ్కే పరిమితమైన నిహారిక.. ఆ గాయం అవ్వడంతో చైతన్య సేవలు
- 44 min ago
Uppena 22 Days Collections: అన్ని సినిమాలున్నా తగ్గని ‘ఉప్పెన’.. వాటితో పోల్చితే కలెక్షన్లు ఎక్కువే
- 48 min ago
సోషల్ మీడియాలో మరో రికార్డును అందుకున్న విజయ్ దేవరకొండ.. నెంబర్ వన్!
- 1 hr ago
చెడ్డి దోస్తాన్ వాల్యూ చూపించిన రామ్ చరణ్.. యువ హీరోకు సడన్ సర్ ప్రైజ్
Don't Miss!
- News
259 మంది సభ్యులతో కమిటీ.. కేసీఆర్, జగన్, చంద్రబాబుకు చోటు, తెలుగువారు వీరే..
- Sports
ఆ సమయంలో పంత్ స్కూప్ షాట్.. ఎవరైనా ఇలా ఆడగలరా అంటూ మాజీల ఆశ్చర్యం వీడియో
- Automobiles
కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్బ్యాక్ టీజర్; త్వరలో భారత్లో విడుదల - వివరాలు
- Finance
గుడ్న్యూస్: క్రిప్టోకరెన్సీ వినియోగంపై ఆలోచిస్తున్నాం..నిర్మలమ్మ ఏం చెప్పారంటే..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రధాని సందేశం కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన హీరోయిన్.. నెటిజన్స్ ట్రోల్స్
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతీ పనీ ఎంతో సులువుగా మారింది. తాము ఇవ్వాలనుకున్న సందేశాన్ని ప్రజలకు చేర్చడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, క్షణాల్లో చేరేలా సహకరిస్తోంది సోషల్ మీడియా. రోజు రోజుకూ దీని ప్రభావం పెరుగుతూ వస్తోంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇదే సోషల్ మీడియా లేనిపోని ట్రోల్స్ బారిన కూడా పడేస్తుంది. తాజాగా హీరోయిన్ ఊర్వశి రౌతేలాకు అలాంటి పరిస్థితే ఎదురైంది.
శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీకి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆమె త్వరగా కోలుకుని ఆరోగ్యం స్థిరపడాలని పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేస్తూ "అజ్మీ షబానాకు జరిగిన ప్రమాదం ఆవేదన కలిగించింది. ఆమె వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నా" అని పేర్కొన్నారు.

అయితే ప్రధాని పెట్టిన ఆ ట్వీట్ ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టేసి తన ట్విట్టర్ అకౌంట్లో తిరిగి పోస్ట్ చేసింది ఊర్వశీ రౌతేలా. ఈ విషయాన్ని గమనించిన నెటిజన్స్ ఆమెపై ట్రోల్స్ ప్రారంభించారు. షబానా అజ్మీకి మెసేజ్ పెట్టాలనుకోవడం మంచిదే.. కానీ ఇలా ప్రధాని మోదీ ట్వీట్ ట్వీట్ కాపీ చేయడమేంటని మండిపడుతున్నారు. దీంతో ఊర్వశీ రౌతేలా మరోసారి ఇలా వార్తల్లో నిలిచింది.