Don't Miss!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- News పొలిటికల్ స్టార్.. తెలంగాణా కాంగ్రెస్ కమాండర్ రేవంత్ రెడ్డి ఈజ్ బ్యాక్!!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
బోనీ కపూర్ అక్కడ టచ్ చేయడంపై రచ్చ: హీరోయిన్ రివర్స్ ఎటాక్!
బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ఆమెను పిరుదుల భాగంలో చేతితో కొట్టినట్లు ఉన్న ఆ వీడియోపై విమర్శల వర్షం కురుస్తోంది. బోనీ కపూర్ వేయకూడని చోట చేయి వేశాడని కొందరు నెటిజన్లు కామెంట్లతో విరుచుకు పడుతున్నారు. మీ కూతురు కూడా ఇండస్ట్రీలోనే ఉన్నారనే విషయం మీకు గుర్తు లేదా? ఆమెను కూడా ఇలాగే ఎవరైనా చేస్తే మీకు బాధ అనిపించదా? అంటూ విమర్శలు చేస్తున్నారు.
అయితే అనుకోకుండా జరిగిన విషయానికి ఇంత పెద్ద రచ్చ చేయాల్సిన అవసరం లేదని మరికొందరు అభిప్రాయం. జయంతి లాల్ గౌడ్ కుమారుడు అక్షయ్ గౌడ వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా మార్చి 31న ఈ సంఘటన చోటు చేసుకుంది.
|
బోనీ కపూర్ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్
సోషల్ మీడియాలో బోనీ కపూర్ను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి మాధ్యమాల్లో ఈ వ్యవహారంపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. అయతే వీటిపై అటు బోనీ కపూర్ కానీ, జాహ్నవి కపూర్ నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. అయితే ఊర్వశీ రౌటేల మాత్రం ఈవిషయాన్ని అంత ఈజీగా తీసుకోలేదు. ఈ వీడియోను సర్క్యలేట్ చేసిన ఓ ప్రముఖ మీడియా సంస్థను ఆమె ఏకిపారేశారు.
|
భగ్గమన్న ఊర్వశీ రౌటేల
ఈ వీడియోను హైలెట్ చేయడంపై ఊర్వశీ రౌటేల స్పందిస్తూ... ‘ఇండియాలోని ప్రముఖ మీడియా సంస్థ ఇలాంటి వార్తలు వేయడం ఏమిటి? మీకు మహిళలను ఎలా గౌరవించాలో తెలియనపుడు దయచేసి మీరు అమ్మాయిల శక్తి, మహిళ స్వేచ్ఛ గురించి మాట్లాడవద్దు.'' అంటూ ఫైర్ అయ్యారు. ఊర్వశీ రౌటేల చేసిన ట్వీట్కు అభిమానుల నుంచి కూడా మద్దతు లభిస్తోంది.
|
ఊర్వశీ ట్వీట్ హాట్ టాపిక్
మహిళల గురించిన మంచి విషయాలను హైలెట్ చేయకుండా... ఇలాంటి పనికిరాని విషయాలను ప్రముఖంగా ఫోకస్ చేస్తుండటం ఏమిటి అంటూ ఊర్వశీ లేవనెత్తిన అంశం హాట్ టాపిక్ అయింది. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఈ వివాదం కారణంగా ఊర్వశీ రౌటేల పేరు మీడియా సర్కిల్లో మారు మ్రోగిపోతోంది.
ఊర్వశీ రౌటేల
మిస్ దివా-మిస్ యూనివర్స్ ఇండియా 2015 టైటిల్ దక్కించుకున్న ఊర్వశీ... మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్ రంగంలోకి అడుగు పెట్టారు. గతేడాది వచ్చిన ‘హేట్ స్టోరీ 4' ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం పాగల్పంటి అనే చిత్రంతో పాటు మరో బాలీవుడ్ మూవీలో నటిస్తోంది.