Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హిమాలయాల్లో మంచు కొండలు బద్దలు.. 150పైగా మృతి.. సోనూసూద్, బాలీవుడ్ ప్రముఖుల సంతాపం
హిమాలయ పర్వత శ్రేణుల్లో మంచు కొండలు బద్దలైన ఘటన ఉత్తరాఖండ్లో విషాదం నింపింది. మంచు కొండలు హఠాత్తుగా కరిగి భారీగా వరద ముంచెత్తడంతో ధౌలీగంగా నది ప్రాంతంలో పలు ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకోయాయి. దాదాపు 150 మందికి పైగా ఈ వరద ముంపుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై దియా మిర్జా, సోనూసూద్తోపాటు బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. సోనూసూద్ ట్వీట్ చేస్తూ మేమంత మీ వెంట ఉన్నాం అంటూ భరోసాను ఇచ్చారు. ఇంకా బాలీవుడ్ ప్రముఖులు ఎవరెవరూ స్పందించారంటే...
Recommended Video
ఉత్తరాఖండ్లో వరద ముంపు
ఉత్తరాఖండ్లో మంచు పర్వతాలు బద్దలయ్యాయనే వార్త నన్ను విషాదానికి గురి చేసింది. ఆ ప్రాంతంలోని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకొంటున్నాను. ఇలాంటి సమయంలో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలి అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ విధానాల వల్లే
హిమాలయ పర్వత శ్రేణుల్లో అనేక డామ్స్ కట్టడమే ఇలాంటి ప్రమాదానికి ప్రధాన కారణం. ఛమోలీ ప్రాంతంలోని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ప్రమాద సమయంలో ఎలాంటి సహాయానికైనా డిజాస్టర్ ఆపరేషన్స్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 1070 గానీ, 9557444486 గానీ కాల్ చేయండి అంటూ పేర్కొన్నారు.
టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి
ఉత్తరాఖండ్లో వరద ముంపు వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉంది. ఎవరైనా వరదల్లో చిక్కకుంటే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి సహాయం పొందండి అంటూ సిద్దార్థ మల్హోత్రా ట్వీట్ చేశారు.
ప్రజలంతా క్షేమంగా ఉండాలంటూ
ఇక బాలీవుడ్ ప్రముఖుల్లో శ్రేయాస్ తల్పాడే, ప్రసూన్ జోషి ఇంకా పలువురు తమ బాధను, సంతాపాన్ని ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. ప్రమాదకర వార్త విని నా హృదయం బాధతో తల్లడిల్లింది. ఆ ప్రాంతంలో వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని శ్రేయాస్ తల్పాడే ట్వీట్ చేశారు. ఛమోలీ, ఇతర జిల్లాలోని ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకొంటున్నాను అంటూ ప్రసూన్ జోషి ట్వీట్ చేశారు.