Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రభాస్ సినిమాలో మరో సీరియల్ నటుడు: ఆ ట్వీట్తో బయటకు వచ్చిన మేటర్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒకటి. చరిత్రతో కూడిన చిత్రాలతో మంచి గుర్తింపును అందుకున్న ఓం రౌత్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. రామాయణం నాటి కథతో.. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్టుతో ఇది తెరకెక్కుతోంది. పాన్ ఇండియా రేంజ్లో వచ్చే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ను కూడా పూర్తి చేసుకుందీ మూవీ. ఈ నేపథ్యంలో తాజాగా ఈ భారీ బడ్జెట్ చిత్రం గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.
'ఆదిపురుష్' మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. ఇందులో ఎంతో మంది హిందీ నటులు కీలక పాత్రలను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో నటుడు ఇందులో భాగం అయ్యాడని తెలిసింది. ఎన్నో సీరియళ్లలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుని ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వత్సల్ సేథ్ 'ఆదిపురుష్'లో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశాడు. దర్శకుడితో దిగిన ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు. అయితే, అతడు ఇందులో ఏ పాత్రను పోషిస్తున్నాడన్న దానిపై క్లారిటీ లేదు.
'జస్ట్ మొహబ్బత్' అనే సీరియల్తో నటుడిగా పరిచయం అయిన వత్సల్ సేథ్.. ఆ తర్వాత చాలా వాటిలో నటించాడు. ఈ క్రమంలోనే 'టార్జాన్.. ద వండర్ కార్' అనే చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా మూవీల్లో నటించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఆదిపురుష్'లో చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. అలాగే, టాల్ బ్యూటీ కృతి సనన్ సీతగా చేస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.