Don't Miss!
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- News Iran Israel War: ఇరాక్ నూ కెలికిన ఇజ్రాయెల్? ఇరాన్ ఉమ్మడి పోస్టుపై దాడి-పోరు తీవ్రం..!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
ప్రభాస్ తమ్ముడిగా నేషనల్ అవార్డ్ విన్నర్: బాలీవుడ్ స్టార్ హీరోను లైన్లో పెట్టేశారు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 'రాధే శ్యామ్' అనే సినిమాలో నటిస్తోన్న అతడు.. అది పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నాడు. ఇందులో హిందీ చిత్రం కూడా ఉంది. అదే.. 'ఆదిపురుష్'. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓం రౌత్ రూపొందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితమే ప్రారంభం అయింది. ప్రస్తుతానికి ప్రభాస్ లేని సీన్లను అందులో చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే యంగ్ రెబెల్ స్టార్ కూడా ఇందులో జాయిన్ కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
'ఆదిపురుష్' రామాయణం నాటి కథతో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగానూ నటిస్తున్నారు. ఇక, ఇందులో ఎంతో ముఖ్యమైన లక్ష్మణుడి పాత్ర కోసం ఇప్పటికే పలువురు హీరోల పేర్లను పరిశీలించారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తమ్ముడిగా సన్నీ సింగ్ కానీ, టైగర్ ష్రాఫ్ గానీ నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాత్ర కోసం బాలీవుడ్కు చెందిన మరో స్టార్ హీరో పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చింది. అతడే.. నేషనల్ అవార్డు విన్నర్ విక్కీ కౌశల్.
ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేసి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న అతడితో ఓం రౌత్ చర్చలు జరిపినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది. దీనికి అతడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బాలీవుడ్ వర్గాల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇక, ఇందులో సీతగా కృతి సనన్ను తీసుకోబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది.