పీకే, మున్నాభాయ్కి సీక్వెల్స్.. క్లారిటీ ఇచ్చిన దర్శక, నిర్మాతలు
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్లో వచ్చిన పీకే చిత్రం సంచలన విజయం సాధించడం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్గా రూపొందిస్తున్నామని రాజ్కుమార్ హీరాని కన్ఫర్మ్ చేశారు.
పీకే చిత్రం క్లైమాక్స్లో అమీర్ ఖాన్ గ్రహాంతరవాసిగా తన గ్రహానికి వెళ్లిపోయిన తర్వాత రణ్బీర్ కపూర్ గ్రహాంతరవాసిగా భూమి మీదకు రావడం జరుగుతుంది. దాంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందనే సంకేతాన్ని అప్పుడే ఇచ్చారు.

పీకే సినిమా సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. సీక్వెల్కు సన్నాహాలు చేస్తన్నాం. రణ్బీర్ గ్రహాంతర వాసి రూపంలో భూమికి వచ్చినట్టు చూపించాం. సినీ రచయిత అభిజత్ ఇంకా ఈ సీక్వెల్కు కథ రాయలేదు. ఆయన మొదలుపెట్టగానే సెట్స్పైకి వెళ్తాం అని నిర్మాత విదూ వినోద్ చోప్రా అన్నారు.
విధూ వినోద్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ.. డబ్బు కోసం మేము బిజినెస్ చేయడం లేదు. సినిమాలు రూపొందించడానికి మాత్రమే మేము బిజినెస్లో ఉన్నాం. ఒకప్పుడు డబ్బు గురించి ఆలోచించాం. ఇప్పుడు మున్నాభాయ్ చిత్రానికి ఆరు నుంచి ఏడు సీక్వెల్స్, పీకేకు మూడు సీక్వెల్స్ రూపొందిస్తే వచ్చే కోట్లాది రూపాయలు సంతోషం, ఉత్సాహం, మనశాంతి దొరుకుతుంది.


Click it and Unblock the Notifications











