Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అప్పుడే సెక్స్పై మోజు తీరుతుంది.. జీవితంలో ఫన్ ఎప్పుండటే.. విద్యాబాలన్
తెలుగు తెరపై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన విద్యాబాలన్ దక్షిణాదిలో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో శృంగార తార సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్లో కూడా ఆమె నటించారు. ప్రస్తుతం హిందీలో విజయం సాధించిన పింక్ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు నేరుగా పరిచయం కాబోతున్నారు. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 40 ఏళ్ల వయసుకు చేరువకావడంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవేమిటంటే..
40 దాటితే మహిళలు అలా
వయసు మీద పడుతుంటే మహిళలు మరింత చలాకీగా, సంతోషంగా, కాన్ఫిడెంట్గా మారుతారు. 40 ఏళ్లు దాటిన తర్వాతే మరింత చిలిపిగా, హాట్గా కనిపిస్తారు. వయసుపై పడుతుంటే అత్యంత సున్నితంగా మారుతారు. సెక్స్ను ఎంజాయ్ చేసే ఆసక్తి తగ్గుతుంది అని అన్నారు.
వయసు మీద పడిన తర్వాత
వయసు మీద పడుతుంటే మహిళలు పెద్దగా వేటిని పట్టించుకోరు. దాంతో చాలా సంతోషంగా ఉంటారు. మీరు దేనిని సీరియస్గా తీసుకోకుంటే జీవితం చాలా ఆనందంగా మారుతుంది అని విద్యాబాలన్ అన్నారు. మహిళల అభిరుచులు, ప్రవర్తన గురించి ఆమె ఆసక్తిగా పలు విషయాలను వెల్లడించారు.
మహిళలకు 35 ఏళ్లు దాటితే
35 ఏళ్ల తర్వాత మహిళలతో బెస్ట్ ఫన్ ఉంటుందని నా స్నేహితుడు చెప్పాడు. అది కూడా నాకు నిజమనిపిస్తుంది. 40 ఏళ్ల తర్వాత ఎవరైనా రిలేషన్లో ఉన్నవాళ్లు ఉన్నారా నాకు చూపించండి అని అన్నారు. 35 ఏళ్ల తర్వాత మహిళలు దేనిని పట్టించుకోరు. 40 దాటితే ఇంకా అసలే పట్టించుకోరు అని విద్యాబాలన్ పేర్కొన్నారు.
ఎన్టీఆర్ బయోపిక్లో బసవ తారకంలా
ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత విద్యాబాలన్ మరో బయోపిక్లో నటిస్తున్నారు. అందులో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో కనిపించారు. మ్యాథమెటిషియన్ శకుంతల జీవితం ఆధారంగా తెరకెక్కించే మూవీలో నటిస్తున్నారు. అలాగే పింక్ తమిళ రీమేక్లో ముఖ్య పాత్రలో కనిపిస్తారు. అలాగే ఆమె నటించిన ఎన్టీఆర్: మహానాయకుడు త్వరలో విడుదల కానున్నది.