Don't Miss!
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
- Automobiles ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
హ్యూమన్ కంప్యూటర్ శకుంతల దేవి బయోపిక్లో విద్యా బాలన్!
విద్యా బాలన్ మరో బయోపిక్ చేయడానికి సిద్దమవుతున్నారు. మ్యాథమేటిక్స్ జీనియస్ శకుంతల దేవి జీవితం ఆధారంగా తెరకెక్కే చిత్రంలో ప్రధాన పాత్రకు ఆమె ఖరారయ్యారు. తన అద్భుతమైన టాలెంటుతో శంకుతల దేవి హ్యూమన్ కంప్యూటర్గా పేరు తెచ్చుకున్నారు.
అను మీనన్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. లండన్, పారిస్, న్యూయార్కులో చిత్రీకరణ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని లెడ్ అబుందంటియా ఎంటర్టైన్మెంట్స్ బేనర్లో విక్రమ్ మల్హోత్రా నిర్మించబోతున్నారు.
హ్యూమన్ కంప్యూటర్గా పేరు తెచ్చుకున్న శకుంతల దేవి పాత్ర చేయబోతుండటం ఆనందంగా ఉందని విద్యా బాలన్ తెలిపారు. ఆమె జీవితం, సాధించిన విజయాలు ఎంతో మందికి స్పూర్తిదాయకం. అలాంటి గొప్ప వ్యక్తి జీవితం గురించి ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
'కహాని' చిత్రానికి నాతో కలిసి విక్రమ్ పని చేశారు. ఈ ప్రాజెక్టులో ఆయన భాగం కావడం మరింత థ్రిల్లింగ్గా ఉంది. దేశంలోనే అత్యంత స్పూర్తిదాయకమైన మహిళ కథను విక్రమ్, అను కలిసి తెరకెక్కిస్తుండటం గర్వంగా ఉందని విద్యా బాలన్ చెప్పుకొచ్చారు.
శంకుతల దేవి 5 ఏళ్ల వయసు నుంచే గణిత శాస్త్రంలో అద్భుతాలు చేయడం మొదలు పెట్టింది. ఆ వయసులోనే 18 సంవత్సరాల విద్యార్థి మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ చేశారు. ఆమె తన మేధోశక్తితో 1982 ఎడిషన్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది.
ఆమె కేవలం గణితశాస్త్ర నిపుణురాలు మాత్రమే కాదు.. ఆస్ట్రాలజర్ కూడా. పలు వంటల పుస్తకాలు, నవలలు రాశారు. స్వలింగ సంపర్కుల గురించి ఆమె ఓ పుస్తకం కూడా రాశారు. ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కే చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది.