Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
విరాట్ కోహ్లీ చేసిన పనికి.. కంటతడి పెట్టిన అనుష్క శర్మ.. బర్త్ డే రోజున అలాంటి గిఫ్ట్!
క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ దాంపత్య జీవితం సాఫీగా సుఖ: సంతోషాల మధ్య సాగిపోతున్నది. సోషల్ మీడియాలో వీరిద్దరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. లాక్డౌన్లో కోహ్లీ, అనుష్క మధ్య జరిగిన చిలిపి సంఘటనలు వైరల్గా మారాయి. తాజాగా వారిద్దరి మధ్య జరిగిన భావోద్వేగమైన సంఘటన నెటిజన్లన్లను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఆ వివారాల్లోకి వెళితే...
యాడ్ షూటింగులో కలుసుకొని
యాడ్ షూటింగులో కలుసుకొన్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకరంటే మరొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత చాలా ఏళ్లు డేటింగ్ చేస్తూ ఒకరినొకరు తెలుసుకొన్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు.
2017లో డెస్టినేషన్ వెడ్డింగ్
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహం 2017లో అట్టహాసంగా ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్గా జరిగింది. అప్పట్లో వీరిద్దరి వివాహం మీడియాలో హైలెట్గా మారింది. ఢిల్లీలో జరిగిన వివాహ విందుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల వారిద్దరికి కూతురు కూడా జన్మించడం తెలిసిందే.
33వ బర్త్ డే రోజును అనుష్క శర్మ
ఇలా
అన్యోన్యంగా
దాంపత్య
జీవితం
కొనసాగుతున్న
నేపథ్యంలో
అనుష్క
శర్మ
తన
33వ
పుట్టిన
రోజును
ఘనంగా
జరుపుకొన్నారు.
ఈ
బర్త్
డే
సెలబ్రేషన్స్లో
పలువురు
స్నేహితులు,
సన్నిహితులు
పాల్గొన్నారు.
ఈ
సందర్భంగా
విరాట్
తన
భార్య
అనుష్క
శర్మపై
ప్రేమను
గుప్పించారు.
విరాట్ కోహ్లీ పాటతో ఎమోషనల్
అనుష్క శర్మ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో విరాట్ కోహ్లీ ఏకంగా భార్య కోసం పాట పాడేశారు. మేరే మహబూబ్ ఖయామత్ హోగీ అంటూ గేయాన్ని అందుకొన్నారు. విరాట్ కోహ్లీ పాడుతున్నంత సేపు అనుష్క శర్మ ఎమోషనల్ అయ్యారు. విరాట్ పాట ముగించగానే అతిథులందరూ చప్పట్ల మోత మోగించారు. ఆ సమయంలో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన అనుష్క కంటతడి పెట్టుకొన్నారు.
Recommended Video
అనుష్క కెరీర్ ఇలా..
అనుష్క
సినీ
కెరీర్
విషయానికి
వస్తే..
హీరోయిన్గా,
నిర్మాతగా
రాణిస్తున్నారు.
లాక్
డౌన్కు
ముందు
జీరో,
అంగ్రేజీ
మీడియం
సినిమాలో
నటించారు.
లాక్డౌన్
సమయంలో
పాతాళ్
లోక్,
బుల్బుల్
అనే
వెబ్
సిరీస్ను
రూపొందించారు.
ప్రస్తుతం
ఖాలా
అనే
వెబ్
సిరీస్ను
నెట్ఫ్లిక్స్
కోసం
తెరకెక్కిస్తున్నారు.
ఈ
వెబ్
సిరీస్కు
బుల్బుల్
డైరెక్టర్
అన్విత
దత్
దర్శకత్వం
వహిస్తున్నారు.