twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మత్తు మందు ఇచ్చి వివస్త్రను చేశారు.. పోర్న్ వీడియోలు షూట్ చేసి.. మాజీ మిస్ ఇండియా సంచలన ఆరోపణలు

    |

    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో పోర్నోగ్రఫి దందా ఒక్కసారిగా బట్టబయలైంది. ఎంతో తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెడుతూ దిగ్బ్రాంతికి గురి చేస్తున్నారు. ఓ వైపు పోర్న్ రాకెట్ కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మరో ఔత్సాహిక నటి, మాజీ వీవీఎన్ మిస్ ఇండియా 2019 విన్నర్ పరీ పశ్వాన్ బాలీవుడ్‌లోని ఓ ప్రొడక్షన్ హౌజ్ గురించి సంచలన ఆరోపణలు చేశారు. పరీ పాశ్వాన్ చేసిన ఆరోపణలు ఏమిటంటే..

    కెరీర్ కోసం ముంబైలో అడుగుపెట్టాను..

    కెరీర్ కోసం ముంబైలో అడుగుపెట్టాను..

    2019లో వీవీఎన్ మిస్ ఇండియా యూనివర్స్‌గా ఎంపికైన తర్వాత యాక్టింగ్ కెరీర్ కోసం ముంబై వచ్చాను. ఆ సమయంలో నా జీవితంలో ఊహించని సంఘటన చోటుచేసుకొన్నది. అయితే ఆ ప్రొడక్షన్ హౌజ్‌లో కొందరు చేసిన నిర్వాకాన్ని బయటపెడితే నా కెరీర్‌ను నాశనం చేస్తారని నేను భయపడ్డాను. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో నేను బయటపెట్టక తప్పడం లేదు అంటూ పరీ పాశ్వాన్ తెలిపింది.

    డ్రింకులో మత్తు మందు కలిపి..

    డ్రింకులో మత్తు మందు కలిపి..

    ముంబైలోని ఓ ప్రొడక్షన్ హౌజ్ నాకు ఆఫర్ ఇవ్వడంతో సంతోషపడ్డాను. కానీ షూటింగు సమయంలో నా డ్రింకులో మత్తు మందు కలిపి నేను స్పృహ కోల్పేయేలా చేశాను. ఆ తర్వాత నన్ను వివస్త్రను చేసి పోర్న్ వీడియోలు తీశారు. ఆ తర్వాత నేను ఎలా మోసపోయ్యాననే విషయం నాకు తెలిసింది అని పరీ పశ్వాన్ తెలిపింది. అయితే ఆ ప్రొడక్షన్ సంస్థ వివరాలను బయటకు వెల్లడించడానికి నిరాకరించారు.

    కొంత మంది గ్యాంగ్.. పోర్న్ వీడియోలు

    కొంత మంది గ్యాంగ్.. పోర్న్ వీడియోలు

    నన్ను మోసగించిన ఆ ప్రొడక్షన్ హౌజ్ నిర్వాహకులు, నాపై లైంగిక దాడికి ప్రయత్నించిన వారిపై నేను ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఆ కేసు దర్యాప్తు, విచారణ ఇంకా కొనసాగుతున్నది. ఈ వ్యవహారంలో నా భర్త, ఇతరులపై కాట్రాస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశాను. ఈ విషయంలో నాకు న్యాయం చేయాలని వేడుకొన్నాను. అమ్మాయిల బలహీనతలను ఆసరాగా చేసుకొని కొంతమంది గ్యాంగ్‌గా ఏర్పడి పోర్న్ వీడియోలు షూట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అలాంటి వ్యవహారంలో నేను బాధితురాలినేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

    అమాయక అమ్మాయిలపై వలవేసి.

    అమాయక అమ్మాయిలపై వలవేసి.

    పోర్న్ వీడియోలను షూట్ చేసు ముఠా వ్యవహారాలు నా దృష్టికి రావడంతో నేను వారిపై కూడా ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాను. ప్రస్తుతం నేను దాఖలు చేసిన ఫిర్యాదుపై మల్వానీ పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి ముఠాలపై నేను పోరాటం చేస్తున్నాను. మరొకరు నాలా మోసానికి గురికావొద్దని ప్రయత్నిస్తున్నాను అని పరీ పశ్వాన్ తెలిపారు.

    Recommended Video

    Anushka Hurts Muslim Religious Views
    భర్తపై కూడా ఫిర్యాదు.. ముంబై పోలీసుల అరెస్ట్

    భర్తపై కూడా ఫిర్యాదు.. ముంబై పోలీసుల అరెస్ట్

    మాజీ మిస్ ఇండియా పరీ పాశ్వాన్ ఇటీవల మరోసారి మీడియా పతాక శీర్షికలను ఆకర్షించారు. వేధింపులు తట్టుకొలేక ఏకంగా భర్తపైనే కేసు నమోదు చేశారు. తనను కట్నం తీసుకు రావాలని వేధిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా నాపై దాడికి పాల్పడుతున్నారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో భర్త నీరజ్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే భర్త నీరజ్ కుటుంబ సభ్యులు పరీ పాశ్వాన్ మరో రకంగా ఆరోపణలు చేశారు. అమాయకులైన అమ్మాయిలను చీట్ చేసి పోర్న్ చిత్రాల్లో నటింప జేస్తున్నారని ఆరోపించడం ఈ వ్వవహారం ఆసక్తిగా మారింది.

    English summary
    VN Miss India Universe 2019 winner Pari Paswan sensational allegations on Bollywood Production house. She said, Mumbai-based production house intoxicated her and shot a porn film of her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X