Don't Miss!
- News మండుటెండల్లో నారాయణ విద్యాసంస్థల సిబ్బందికి ఎన్నికల కష్టం!!
- Lifestyle రాత్రిపూట అలర్జీలు పెరుగుతున్నాయా? ఈ నియమాలు పాటిస్తే నిద్ర తేలికగా వస్తుంది
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
బాహుబలిని తలదన్నే సినిమా.. ఔరంగజేబుగా రణ్వీర్.. బాలీవుడ్కు షాకిచ్చిన కరణ్..
బాహుబలి స్ఫూర్తితో కరణ్ జోహర్ నిర్మాణ సారథ్యంలో రూపొందనున్న తఖ్త్ చిత్ర ప్రకటన బాలీవుడ్ను కుదిపేసింది. ఎందుకంటే ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, కరీనా కపూర్ ఖాన్, అలియాభట్, వికీ కౌశల్, భూమి పడ్నేకర్, జాహ్నవి కపూర్, అనిల్ కపూర్ నటిస్తున్నారు. భారీ హంగులు, సాంకేతికతతో నిర్మిస్తున్న చిత్రంపై సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
|
మొగల్ చరిత్ర ఆధారంగా
మొగల్ చరిత్ర నేపథ్యంగా తఖ్త్ సినిమాను కరణ్ జోహార్ రూపొందించడం గమనార్హం. అయితే కరీనా, రణ్వీర్ కలిసి నటిస్తున్నారనే విషయం అభిమానుల్లో జోష్ను పెంచింది. కానీ ఈ చిత్రంలో రణ్వీర్కు కరీనా సోదరిగా నటిస్తున్నారట. రణ్వీర్ ఔరంగజేబ్గా నటిస్తున్నారు.
అక్కా తమ్ముళ్లుగా కరీనా, రణ్వీర్
బాలీవుడ్ పత్రిక కథనం ప్రకారం.. తఖ్త్ సినిమాలో రణ్వీర్, కరీనా అక్కా తమ్ముళ్లుగా నటిస్తున్నారు. మొగల్ సామ్రాజ్యానికి సంబంధించిన కథను తెరకెక్కిస్తున్నారు. మొగల్ సామ్రాజ్యానికి సంబంధించిన తొలి పౌరురాలు జాహనారా బేగంగా కరీనా కనిపించనున్నారట. జహనారా బేగం షాజాహాన్, ముంతాజ్ కూతురు జాహనారా బేగం అనే విషయం తెలిసిందే. ఆమె సోదరులే దారా షీఖో, ఔరంగ జేబ్.
అధికార పీఠం కోసం యుద్ధ:
తఖ్త్ చిత్రంలో కుటుంబ కలహాలు, అధికార పీఠం కోసం వెన్నుపోట్లు, ప్రేమ, విజయం లాంటి విభిన్నమైన, భావోద్వేగ అంశాలతో రూపొందనున్నది. ప్రేమ కోసం యుద్ధం చేయడమే తఖ్త్ చిత్ర కథ అని కరణ్ జోహర్ చెప్పారు.
2020లో విడుదల
తఖ్త్ చిత్రాన్ని స్వీయ నిర్మాణ సారథ్యంతోపాటు దర్శకత్వం కూడా కరణ్ జోహర్ వహిస్తున్నారు. బాహుబలి స్ఫూర్తితో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించేందుకు కథను సిద్దం చేసుకొన్నారట. ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.