Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘పీఎం నరేంద్రమోదీ’పై బ్యాన్?... మాకు హక్కులేదు.. ఆసక్తికరంగా వివాదం
ప్రధాని నరేంద్రమోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన పీఎం నరేంద్రమోదీ మూవీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ చిత్ర రిలీజ్పై స్టే విధించాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల సమయంలో ఓటర్లపై ప్రభావం పడుతుందనే కారణాన్ని చూపుతూ పలువురు ఈ సినిమాపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఈ చిత్రంపై నిషేధం విధిస్తుందా అనే విషయం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే...
పీఎం నరేంద్రమోదీపై పిల్
పీఎం నరేంద్రమోదీ సినిమా రిలీజ్ను వాయిదా వేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన తౌసీఫ్ షేక్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశాం. కేంద్ర సమాచార వాఖ, సెన్సార్ బోర్డు, ఎన్నికల కమీషన్, నిర్మాతలను, నటీనటులను మొత్తం 10 మందిని ఈ కేసులో బాధ్యులిగా చేశాం అని అన్నారు.
మాకు హక్కులేదు: ఈసీ
పీఎం నరేంద్రమోదీ సినిమా రిలీజ్ను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల స్పందిస్తూ.. ఈ బయోపిక్ రిలీజ్ను తాము వాయిదా వేసే హక్కు లేదు. సెన్సార్ బోర్డు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. త్వరలోనే వారు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారు అని ఈసీ అధికారులు వెల్లడించారు.
ఆయనను హీరోగా చూపించే.
పీఎం నరేంద్రమోదీ సినిమాపై వస్తున్న ఆరోపణలపై హీరో వివేక్ ఒబేరాయ్ స్పందిస్తూ.. ఎన్నికల సమయంలో రిలీజ్ కావడం యాదృచ్చికం మాత్రమే. ఇది ప్రచారపరమైన చిత్రం కాదు. సినిమా ద్వారా మోదీని హీరోగా చిత్రీకరించనవసరం లేదు. ఎందుకంటే ఆయన కోట్లాది మంది హృదయాల్లో హీరోగా మారారు అని అన్నారు.
సెన్సార్ బోర్డు నిర్ణయంపై దృష్టి
పీఎం మోదీ బయోపిక్ రిలీజ్ డేట్ సమీపించిన నేపథ్యంలో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. సెన్సార్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం అత్యంత ఆసక్తిగా మారింది. ఒకవేళ రిలీజ్ ఆపివేస్తే రాజకీయ వర్గాల నుంచి వచ్చే స్పందన ఏమిటనేది చర్చనీయాంశమైంది.