Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దంగల్ బేబీకి చేదు అనుభవం.. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో జైరా వసీం..
దంగల్ బేబీ జైరా వసీంకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. మిడతల దాడి నేపథ్యంలో జైరా చేసిన ట్వీట్పై భారీ ఎత్తున్న నెటిజెన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. దాంతో ఆమె తన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఉధృతంగా దాడి చేయడంతో ఆమె నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఈ వివాదం వివరాల్లోకి వెళితే..
ఖురాన్ ప్రవచనాన్ని ట్వీట్ చేస్తూ
దేశంలోని పలు రాష్ట్రాల్లో మిడుతల దండు దాడి చేస్తున్న నేపథ్యంలో జైరా వసీం పవిత్ర ఖురాన్లోని ప్రవచనాన్ని ఉటంకిస్తూ ట్విట్టర్లో ఓ పోస్టు చేశారు. మనుషుల అహంకారం కారణంగానే మిడతల దాడులు, వరదలు లాంటి విపత్తులు సంభవిస్తున్నాయి. మనుషుల చేసిన పాపాలకు ఫలితంగానే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు అనే అర్ధం వచ్చేలా జైరా పోస్టు పెట్టింది.
సున్నిత భావాలు దెబ్బ తీసేలా
ఖురాన్ను ఉటంకిస్తూ జైరా వసీం ట్వీట్ చేసిన కాసేపటికే నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సున్నిత భావాలను దెబ్బ తీసేలా ఉన్నాయి అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోలింగ్కు దిగారు. మరో పక్క కొందరు జైరా ట్వీట్ను సమర్ధిస్తూ ఆమెకు బాసటగా నిలిచారు.
దేవుడి దండన అంటూ పోస్టు పెడుతావా?
జైరా వసీం ట్వీట్పై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇలాంటి సమయాల్లో అలాంటి పోస్టు చేయడం సమంజసం కాదు. అనాలోచితంగా తీసుకొన్న నిర్ణయం. ప్రజలు ఒకవైపు కరోనా, వరదలు, మిడతల దాడితో కష్టాలు పడుతుంటే.. మరోవైపు ఇది దేవుడి దండన అంటూ పోస్టు పెట్టడం సరికాదు అంటూ ట్వీట్ చేశారు.
ఈ భూమ్మీద ఉన్నావా?
జైరాపై మరో నెటిజన్ కామెంట్ చేస్తూ.. ఏం చేస్తున్నావో అర్ధమవుతుందా జైరా. నీవు చేసిన ట్వీట్ గురించి ఆలోచించు. ఈ భూమ్మీదనే ఉన్నావా? లేక మరో గ్రహానికి వెళ్లావా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలా ప్రతికూల, సానుకూల ట్వీట్లు వెల్లువెత్తడంతో ఆమె తన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లను క్లోజ్ చేశారు.
జైరా వసీం కెరీర్..
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన దంగల్ చిత్రంలో తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. ఇక మత రహిత వివాదంతో ఆమె యాక్టింగ్ నుంచి తప్పుకొంటున్నట్టు 2019లో పేర్కొన్నారు. ఇక జైరా చివరి చిత్రం ది స్కై ఈజ్ పింక్. ప్రియాంక చోప్రా, ఫర్హాన్ అఖ్తర్తో కలిసి ఆమె నటించారు.