Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కష్టమే ...: 'లయన్' పై ఇంకా 12 కోట్లు బర్డెన్
హైదరాబాద్: ఫ్లాఫ్ టాక్ వచ్చిందంటే రెండో షోకే కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయిపోతున్న రోజులు ఇవి. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ ..సినిమాలు కొనే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే వారికి అనుకోని దెబ్బలు,ఊహించని భాక్సాఫీస్ ట్విస్ట్ లు పడుతూనే ఉంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తాజా చిత్రం 'లయన్' ని కొనుక్కున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా 12 కోట్ల వరకూ వారిపై బర్డెన్ పడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 30 కోట్లుకు ధియోటర్ రైట్స్ లెక్కేసి చూస్తే ...కేవలం 24 కోట్లు మాత్రమే అడ్వాన్స్ లు రూపంలో వచ్చాయి. దాంతో నిర్మాతకు మొదటే ఆరు కోట్లు డెఫిషిట్ వచ్చింది. అయితే డిస్ట్రిబ్యూటర్స్ కు ఆ 24 కోట్లు కూడా ఎంతవరకూ రికవరీ అవుతుందో అర్దం కాని సిట్యువేషన్ అని చెప్పుకుంటున్నారు.
ఇప్పటివరకూ 12.06 కోట్లు రికవరీ అయ్యాయి అని, ఇంకా 12 కోట్లు రిస్క్ అలాగే మిగిలి ఉందని చెప్పుకుంటున్నారు. ఇదే రన్ కొనసాగితే అందులో సగం అంటే ఆరు కోట్లు కూడా రావటం కష్టమే అని అంటున్నారు.
ఇక ఈ చిత్రం మొన్న గురువారం విడుదలైంది. అయితే మార్నింగ్ షోకే చాలా చోట్ల నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ విషయంలో మాత్రం జస్ట్ ఓకే అనిపించుకుంది. రికార్డులు తిరగరాస్తుందనుకున్న ఈ చిత్రం డివైడ్ టాక్ దెబ్బకు..తొలి రెండు రోజులు...కేవలం7.8 గ్రాస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు మూడో రోజు అంటే శనివారం,కీలకమైన ఆదివారాలు బాగా డ్రాప్ కనపడింది. ముఖ్యంగా మల్టిఫ్లెక్స్ లు చాలా చోట్ల ఖాళీగా కనిపించాయి. బి,సి సెంటర్లే ఈ చిత్రాన్ని కొద్దో,గొప్పో ఆదుకుంటున్నాయి.
కథేమిటంటే....
ముంబైలోని మనోహర్ హాస్పటిల్ లో ...కోమాలో ఉన్న గాడ్సే(బాలకృష్ణ) ఒకరోజు లేచి కూర్చుంటాడు. చాలా కాలం తర్వాత స్పృహలోకి వచ్చిన గాడ్సే...తన పేరు బోస్ అని గాడ్సే కాదని చెప్తూడు. అంతేకాక అక్కడకి వచ్చిన తల్లితండ్రులు(చంద్రమోహన్, జయసుధ)లను, భార్య (రాధికా ఆప్టే)ని గుర్తుపట్టక...వాళ్లు అసలు తన వాళ్ళే కాదని పొమ్మంటాడు. అంతటితో సరిపెట్టక..సరయు(త్రిష) రోడ్డు మీద కనపడితే..ఆమె తన గర్ల్ ఫ్రెండ్ అని వెనకపడతాడు .
ఓ ఇంటికి వెళ్లి అది తన ఇల్లే అంటాడు. అక్కడున్న చలపతిరావు, గీతలను తన తల్లితండ్రులు అంటాడు. ఇంతకీ గాడ్సే ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు. అదేమన్నా హెల్త్ ప్లాబ్లమా..లేక అతను చెప్పేది నిజమేనా... ఇంతకీ ..అతను చెప్పే బోస్ ఎవరు...ముఖ్యమంత్రి (ప్రకాష్ రాజ్) కు గాడ్సేకు వైరం ఏమిటి... బోస్, గాడ్సే వేరు వేరా..ఒకరేనా అనే విషయాలు తెలుసుకోవాలంటే ...సినిమా చూడాల్సిందే.
బాలకృష్ణ సరసన త్రిష హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్రాజ్, జయసుధ, అలీ, గీత, చంద్రమోహన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: వెంకట్ ప్రసాద్, కూర్పు: గౌతంరాజు