Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈ వీడియో చూశారా? ‘పేట’ 25వ రోజు, టోటల్ కలెక్షన్ ఎంత?
2019 సంవత్సరంలో సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' రూపంలో తొలి అతిపెద్ద హిట్ నమోదు చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయవంతంగా రన్ అవుతూ 4వ వారంలోకి అడుగు పెట్టింది.
తాజాగా ఈచిత్రం 25వ రోజుకు చేరిన సందర్భంగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రజనీకాంత్ డబ్బింగ్ చెబుతున్న వీడియో ట్వీట్టర్లో షేర్ చేసి అభిమానలను సర్ ప్రైజ్ చేశారు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం తలైవా హిట్ చిత్రాల జాబితాలో చేరిన సంగతి తెలిసిందే.
|
రజనీకాంత్ ‘పేట’
‘పేట' సినిమా 25వ రోజుకు చేరుకున్న సందర్భంగా అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు ఈ వీడియో షేర్ చేసినట్లు కార్తీక్ సుబ్బరాజ్ వెల్లడించారు.
రూ. 200 కోట్లు
‘పేట' చిత్రం ఇప్పటికే రూ. 200 కోట్ల వసూళ్ల మార్కును దాటేసింది. ఈ చిత్రం ఫుల్ రన్లో రూ. 250 కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఆ మార్క్ అందుకుంటుందా? లేదా? అనే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో నెలకొని ఉంది. దర్శకుడు మళ్లీ వింటేజ్ రజనీకాంత్ను ఈ సినిమా ద్వారా చూపించడం అభిమానులను మెప్పించింది.
చెన్నైలో కేక
‘పేట' చిత్రం ఒక్క చెన్నైలోనే 18 రోజుల్లో రూ. 14.06 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డు నమోదు చేసింది. సినిమా విడుదలైన దాదాపు అన్ని చోట్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాలు తెచ్చిపెట్టి రజనీ బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
యూఎస్ఏలోనూ అదుర్స్
‘పేట' చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద కూడా అదరగొట్టింది. 7,836,370 ($1.9M) గ్రాస్ రాబట్టింది. ఈ సినిమాతో పాటు విడుదలైన ‘విశ్వాసం' కలెక్షన్లను చాలా చోట్ల ‘పేట' అధిగమించడం గమనార్హం. ఇందులో రజనీకి జోడీగా సిమ్రన్, త్రిష నటించారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మించారు.