Don't Miss!
- Sports T20లో డబుల్ సెంచరీ: ఆ భారత ప్లేయర్కే సాధ్యం- విలియమ్సన్
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- News తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేసిన బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఒకే రోజు రాబోతున్న 3 డిఫరెంట్ మూవీస్: కానీ అందరి చూపు ఆ మూవీపైనే.. షాకింగ్ బిజినెస్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల తరువాత మరో బిగెస్ట్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. మిగతా ఇండస్ట్రీలలో ఇంకా అనుకున్నంత స్థాయిలో సినిమాల హడావుడి మొదలు కాలేదు. కానీ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాత్రం అప్పుడే వార్ మొదలైంది. కంటెంట్ బావున్న సినిమాలు భారీ స్థాయిలో ప్రాఫిట్స్ అందిస్తున్నాయి. ఇక గురువారం ఒకేసారి మూడు సినిమాలు రాబోతుండగా అందులో ఒక సినిమా భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేస్తోంది.
జోరుమీదున్న టాలీవుడ్ బాక్సాఫీస్
సంక్రాంతి వచ్చిన క్రాక్, మాస్టర్, రెడ్ వంటి డిఫరెంట్ సినిమాలు కొంత గ్యాప్ తీసుకొని ఆడియెన్స్ ముందుకి వచ్చాయి. ఇక ఆ తరువాత ఉప్పెన మూవీ సోలోగా వచ్చి వాలెంటైన్స్ సీజన్ లో భారీ స్థాయిలో వసూళ్లను అందుకుంది. ఇక అల్లరి నరేష్ నాంది సైతం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ గా లాభాలను అందుకుంది. గత వారం వచ్చిన మూడు సినిమాల్లో A1 ఎక్స్ ప్రెస్ ఒక్కటే నిలదొక్కుకుంటోంది.
గాలి సంపత్ బిజినెస్ ఎంత?
ఇక చాలా రోజుల తరువాత ఒకేరోజు మూడు తెలుగు సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నాయి. శివరాత్రి కావడంతో ఈ డేట్ ను ఏ మాత్రం మిస్ చేసుకోవడం లేదు. అనిల్ రావిపూడి సపోర్ట్ తో అతని అసిస్టెంట్ చేసిన సినిమా గాలి సంపత్. రాజేంద్రప్రసాద్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆరు కోట్ల లోపే బిజినెస్ చేసినట్లు టాక్ వస్తోంది.
శర్వానంద్ టార్గెట్..
ఇక శర్వానంద్ ఈ సారి మరో ఫీల్ గుడ్ సినిమాతో బాక్సాఫీస్ హిట్ కొట్టాలని రెడీ అయ్యాడు. వ్యవసాయం, రైతులు వంటి అంశంతో వచ్చిన సినిమా శ్రీకారం. ఈ సినిమా పాటలతోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక 17కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అవుతున్నట్లు సమాచారం.
అందరిచూపు జాతిరత్నాలు పైనే..
అయితే గురువారం రాబోయే సినిమాల్లో అందరి చూపు ఎక్కువగా జాతిరత్నాలు పైనే ఉంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆ సినిమా టీజర్, సోంగ్స్, ట్రైలర్ లతోనే మంచి బజ్ క్రియేట్ చేసింది. దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ 12కోట్ల వరకు వెళ్లింది. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ తో కూడా సినిమాపై హైప్ భారీగానే క్రియేట్ అయ్యింది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో అంచనాలను అందుకుంటుందో చూడాలి.