Don't Miss!
- News Bridge Collapse: కూలిన నిర్మాణంలోని వంతెన.. తప్పిన ప్రమాదం..
- Finance Stock To Buy: రూ.90కి చేరుకోకున్న రూ.35 స్టాక్.. కారణం ముఖేష్ అంబానీనే తెలుసా..??
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Sports హార్దిక్ వద్దు.. రోహిత్ తర్వాత అతనే భారత్ కెప్టెన్- హర్భజన్
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
2015 లో రిలీజయ్యే తొలి తెలుగు సినిమా
హైదరాబాద్: సంవత్సరం ప్రారంభంలో ఏ సినిమా రిలీజ్ అవుతుంది అనేది ఎప్పుడూ సినిమా లవర్స్ కు ఆసక్తే. వచ్చే సంవత్సరం ప్రారంభంలో తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమా వివరాలు ఇస్తున్నాం. ఆ చిత్రం మరేదో కాదు...షఫి ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘ఎ శ్యామ్ గోపాల్వర్మ ఫిల్మ్' . దీనికి ‘నా సినిమా నా ఇష్టం' అనేది ఉప శీర్షిక. సమష్టి క్రియేషన్స్ పతాకంపై విజయకుమార్ రాజు, రాకేశ్ శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జోయాఖాన్ హీరోయిన్.
ఫేస్బుక్ ద్వారా అన్ని అప్డేట్స్ పొందండి
దర్శకుడు రాకేష్ శ్రీనివాస్ మాట్లాడుతూ-‘‘ ఇందులో నటుడిగా షఫిలో కొత్తకోణాన్ని చూస్తారు. రక్తపాతం ప్రధానంగా సినిమాలు తీసే శ్యామ్గోపాల్ వర్మ అనే దర్శకుడు దాని వల్ల చివరకు ఎలాంటి ఫలితాన్ని పొందాడనేది ఇందులో ప్రధానాంశం. సెటైరికల్ కామెడీ థ్రిల్లర్గా దీన్ని తెరకెక్కిస్తున్నాం''అని చెప్పారు.
నిర్మాత విజయ్కుమార్ రాజు మాట్లాడుతూ- ‘‘వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం''అని పేర్కొన్నారు. శ్యామ్గోపాల్ వర్మ పాత్రలో ఆసక్తికరమైన అంశాలు దొరికాయనీ, నటనకు అవకాశమున్న పాత్ర అనీ షఫీ అన్నారు. ఇది తనకు తొలి దక్షిణాది చిత్రమని జోయాఖాన్ చెప్పారు. ఇలాంటి కొత్త తరహా చిత్రానికి కొత్త తరహాలో సంగీతాన్ని అందించే అవకాశం లభించిందని సంగీత దర్శకుడు ‘మంత్ర' ఆనంద్ తెలిపారు.
హింస, రక్తపాతం ప్రధానంగా సినిమాల్ని రూపొందించే ఓ దర్శకుడు చివరకు జీవితంలో ఏం సాధించాడు? అతడి కెరీర్లో చోటుచేసుకున్న ఆసక్తికరమైన మలుపులేమిటి? అనే అంశాలకు సున్నితమైన హాస్యాన్ని, వ్యంగ్యాన్ని మేళవించి ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ (నా సినిమా నా ఇష్టం) చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు
శివకృష్ణ, జయప్రకాష్రెడ్డి, ఎల్.బి.శ్రీరాం, సూర్య, పృథ్వీరాజ్, తెలంగాణ శకుంతల, కొండవలస తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాహుల్శ్రీవాత్సవ్, సంగీతం: మంత్ర ఆనంద్, ఆర్ట్: పార్థసారధి వర్మ, ఎడిటర్: కార్తీకశ్రీనివాస్, కథ, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం: రాకేష్శ్రీనివాస్.