Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Adipurush: స్నేహితులకు డీల్ సెట్ చేయించిన ప్రభాస్.. భారీ ధరకు థియేట్రికల్ రైట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా రెండు సినిమాలతో నిరాశపరచడంతో ఇప్పుడు అందరి ఫోకస్ తదుపరి సినిమా పైనే ఉంది. నెక్స్ట్ ప్రభాస్ నుంచి రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ అనే సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని ప్రభాస్ నమ్మకంతో ఉన్నాడు. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన కనీసం ఫస్ట్ లుక్ టీజర్ కూడా విడుదల చేయకపోవడంపై అభిమానుల నుంచి అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
కనీసం ప్రభాస్ పుట్టినరోజు అయిన ఒక పోస్టర్ కూడా విడుదల చేయకపోవడంపై ఫ్యాన్స్ అయితే చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ ముగించుకున్న చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉంది. అలాగే మరొకవైపు నిర్మాతలు సినిమా బిజినెస్ కు సంబంధించిన డీల్స్ కూడా మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో భారీ స్థాయిలో నష్టపోయిన తన స్నేహితులకు ప్రభాస్ ఈ సినిమా ద్వారా ఒక అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఆదిపురుష్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను మంచి డిమాండ్ అయితే ఉంది. ఇక ఆ థియేట్రికల్ రైట్స్ యూవీ క్రియేషన్స్ కు ఇప్పించే విధంగా ఆదిపురుష్ నిర్మాతలతో మాట్లాడినట్లు సమాచారం. ఇక రెండు రాష్ట్రాల్లో థియేటర్లకు వందకోట్లకు పైగానే డిమాండ్ ఉండగా ప్రభాస్ కరెక్ట్ గా 100 కోట్లకు డీల్ సెట్ చేయించి వారికి అప్పగించినట్లు సమాచారం.
యూవీ క్రియేషన్స్ ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ సినిమాతో బిజినెస్ చేయబోతోంది. మరి సాహో రాధేశ్యామ్ సినిమాలతో ఊహించని నష్టాలు ఎదుర్కొన్న యూవీ క్రియేషన్స్ ఈ సినిమాతో అయినా ప్రాఫిట్స్ అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఆదిపురుష్ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. కృతి సనోన్ ఈ సినిమాలో సీత పాత్రలో నటిస్తుండగా రావణాసుర పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతున్నాడు.