Don't Miss!
- News క్రైస్తవ పాఠశాలపై హిందువుల దాడి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
బూతు సినిమా సంచలనం.. కాసుల పంట పండిస్తున్న ఏడు చేపల కథ
అడల్ట్ కంటెంట్ సినిమాలు చూడటం పట్ల బాగా ఆసక్తి చేపుతున్నారు నేటితరం ప్రేక్షకులు. అందుకే అడల్ట్ కంటెంట్ తో వచ్చే సినిమాలు, టీజర్లు, ట్రైలర్లు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి కాసుల పంట పండించింది ఏడు చేపల కథ సినిమా. ఈ రోజుల్లో బూతు బొమ్మలకు మార్కెట్లో మాంచి గిరాకీ ఉందని నిరూపిస్తూ బ్రేక్ ఈవెన్ దాటేసింది.
పక్కా అడల్ట్ కంటెంట్తో వస్తున్నామని ముందుగానే చెప్పిన 'ఏడు చేపల కథ' చిత్ర యూనిట్ కమర్షియల్గా క్లిక్ అయ్యింది. A సర్టిఫికేట్ చిత్రాలను ఇష్టపడే అభిమానులు తొలి రోజే ఈ సినిమాకు నీరాజనం పలికారు. దీంతో ఈ మూవీకి పాజిటివ్ బజ్ ఏర్పడింది. మొదటి వీకెండ్ లోనే చాలా వరకు ప్రేక్షకుల జేబుకు చిల్లు పెట్టి కాసులు పిండేసింది 'ఏడు చేపల కథ'.
భారీ ఎత్తున దాదాపు భారీగా 500 స్క్రీన్స్పై విడుదల చేయబడిన 'ఏడు చేపల కథ' మూవీ తొలి రోజే 1.9 కోట్లు కొల్లగొట్టి.. అదే రన్ కొనసాగించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో 1.4 కోట్లకు అమ్మగా సినిమా 8 రోజులు పూర్తయ్యే సరికి 2.3 కోట్ల షేర్ అందుకుని సంచలనం సృష్టించింది, ఇక వరల్డ్ వైడ్గా 1.7 కోట్లకు అమ్మగా సినిమా 2.4 కోట్ల రేంజ్ షేర్ అందుకొని సక్సెస్ ఫుల్గా బ్రేక్ ఈవెన్ దాటేసింది. నిర్మాతలు సేఫ్ జోన్లో పడిన నిర్మాతలు ఇక ముందు లాభాల బాటలో వెళ్తామని ఖుషీ అవుతున్నారు.