Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'మిస్టర్ మజ్ను' వీకెండ్ కలెక్షన్స్.. ఇంకా సగానికిపైగా, సేవ్ అయ్యే ఛాన్స్ ఉందా!
అఖిల్ నటించిన మూడవ చిత్రం మిస్టర్ మజ్ను. తొలిప్రేమ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మిస్టర్ మజ్నులో అఖిల్ లవర్ బాయ్ ఆటిట్యూడ్, స్టైలిష్ లుక్ ఆడియన్స్ ని బాగా ఆకర్షించాయి. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టర్ మజ్ను చిత్రానికి తొలి షో నుంచే డివైడ్ టాక్ మొదలయింది. సినీ విశ్లేషకుల నుంచి కూడా ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. దీనితో మిస్టర్ మజ్ను చిత్రానికి వసూళ్లు కూడా యావరేజ్ గానే ప్రారంభమయ్యాయి. వీకెండ్ ముగిసిన నేపథ్యంలో మిస్టర్ మజ్ను 3 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
తొలిరోజు నుంచి అదే పరిస్థితి
అఖిల్ నటించిన తొలి రెండు చిత్రాలు అఖిల్, హలో నిరాశపరిచినప్పటికీ ఆ చిత్రాలకు ఫస్ట్ డే ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ మిస్టర్ మజ్ను చిత్రం ఓపెనింగ్స్ విషయంలో నిరాశపరిచింది. ప్రపంచ వ్యాప్తంగా మిస్టర్ మజ్ను చిత్రం తొలి రోజు 4.35 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది. వీకెండ్ డేస్ శని, ఆదివారాల్లో కూడా మిస్టర్ మజ్ను చిత్రానికి ఇదే పరిస్థితి కొనసాగింది.
మూడురోజుల వసూళ్లు
మిస్టర్ మజ్ను చిత్రం మూడు రోజుల్లో 9.65 కోట్ల షేర్ రాబట్టింది. గ్రాస్ విలువ 16 కోట్ల వరకు చేరింది. నైజాంలో మిస్టర్ మజ్ను చిత్రం అత్యధికంగా 3 కోట్ల షేర్ సాధించింది. ఇక్కడ 6 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. దీనితో డిస్ట్రిబ్యూటర్ ఏ మేరకు సేవ్ అవుతాడనేది ఆసక్తిగా మారింది. వైజాగ్ లో 98 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 50 లక్షలు, వెస్ట్ లో 39 లక్షలు, కృష్ణాలో 60 లక్షల షేర్ ని మిస్టర్ మజ్ను చిత్రం సాధించింది. సీడెడ్ లో 1.18 కోట్ల షేర్ రాబట్టింది.
ఆయన గాడ్ ఫాదర్లా నడిపించారు.. నేను న్యాయం చేశాను.. అఖిల్
సగానికి పైగా
మిస్టర్ మజ్ను చిత్రానికి జరిగిన ప్రీరిలీజ్ బిజినెస్ వాల్యూ 24 కోట్లు. అంటే ఈ చిత్ర బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే ఇంకా సగానికిపైగా వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. ఈ చిత్రానికి వస్తున్న డివైడ్ టాక్ నేపథ్యంలో మిస్టర్ మజ్ను చిత్ర వాసులు వీక్ డేస్ లో స్టడీగా కొనసాగుతాయా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. వీక్ డేస్ లో వసూళ్లు తగ్గితే బయ్యర్లు ఎంతోకొంత నష్టపోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రచార కార్యక్రమాల్లో
సినిమాపై ఆసక్తిని పెంచనేదుకు అఖిల్, వెంకీ అట్లూరి, ఇతర చిత్ర యూనిట్ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. తమన్ అందించిన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. గత మూడు చిత్రాలుగా అఖిల్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. కానీ అఖిల్ కోరికని తీర్చే చిత్రం ఇంకా రాలేదు.