Don't Miss!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రూ. 200కోట్ల దిశగా అక్షయ్ సినిమా.. 13వ రోజూ తగ్గని జోరు
సామాజికి నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించి సూపర్ స్టార్ ఇమేజ్తో దూసుకుపోతున్నాడు అక్షయ్ కుమార్. ఇటీవలి కాలంలో వరుస విజయాలను అందుకుంటోన్న బాలీవుడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకడు. సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలను చేస్తూ.. మంచి సందేశాలను ఇస్తున్నాడు. గతేడాది కేసరి, మిషన్ మంగళ్, హౌస్ఫుల్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లోనటించిన సంగతి తెలిసిందే. గతేడాది చివర్లో వచ్చిన గుడ్ న్యూస్ కూడా భారీ విజయాన్ని నమోదు చేసి.. ఇంకా వసూళ్ల సునామిని సృష్టిస్తోంది.
దర్శకుడు రాజ్ మెహతా రూపొందించిన కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గుడ్ న్యూస్ మూవీ వసూళ్ల హవా కొనసాగుతూనే ఉంది. విడుదలై రెండు వారాలు అవుతున్నా బాక్సాఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లు సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. కాగా ఈచిత్రం విడుదలైన 13 రోజులకు గాను 177.31 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఈ వారాంతానికి గుడ్ న్యూస్ మూవీ 200కోట్ల మార్కు చేరుకోవడం ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
పిల్లల కోసం సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లిన రెండు జంటల విషయంలో జరిగిన పొరపాటు కారణంగా జరిగే సంఘటనల నేపథ్యంలో తెరకెక్కింది ఈ చిత్రం. అక్షయ్ కుమార్, కరీనా కపూర్, ధిల్జీత్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటించారు. బాలీవుడ్ 2019 ని గుడ్ న్యూస్ విజయంతో ముగించింది. ఇక గత ఏడాది అక్షయ్ నటించిన నాలుగు చిత్రాలు విడుదల కాగా అన్ని చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి. గతేడాది అక్షయ్ అన్ని సినిమాలు కలిపి దాదాపు 700కోట్లు కొల్లగొట్టినట్టు రిపోర్ట్స్ వచ్చాయి.