Don't Miss!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కేసరి బాక్సాఫీస్ కలెక్షన్లు.. అక్షయ్ కుమార్ కెరీర్లోనే హయ్యెస్ట్గా
హోళీ పండుగను పురస్కరించుకొని విడుదలైన యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటించిన కేసరి చిత్రం బాక్సాఫీస్ వద్ద సానుకూలమైన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న కథతో ఈ సినిమా రూపొందింది. 1897లో జరిగిన సారాగర్హి యుద్ధం బ్యాక్డ్రాప్గా ఈ సినిమా ప్రేక్షకులకు ముందుకొచ్చింది. ఈ సినిమా వసూళ్లు భారీగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..
భారీస్థాయిలో కేసరి రిలీజ్
పదివేల మంది అఫ్గన్ వేర్పాటువాదులతో 21 మంది సైనికులు చేసిన పోరాటం నేపథ్యంగా కేసరి చిత్రం రూపొందింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో రిలీజ్ అయింది. అక్షయ్ కుమార్ సినిమా ఈ రేంజ్లో రిలీజ్ కావడం ఇదే మొదటిసారి కావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
4200 స్క్రీన్లలో విడుదల
కేసరి చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4200 వేల స్క్రీన్లలో రిలీజ్ అయింది. దేశంలో 3600 స్క్రీన్లు, ఓవర్సీస్లో 600 స్క్రీన్లలో రిలీజ్ అయింది అని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మార్చి 21 తేదీ సెలవుదినం కావడంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి కలెక్షన్లపరంగా మంచి రెస్పాన్స్ వస్తుంది.
తొలి రోజు వసూళ్లు
స్వదేశీ మార్కెట్లో కేసరి చిత్రం భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సుమారు తొలి రోజు కలెక్షన్లు రూ.25 కోట్లు స్వదేశంలో రాబట్టే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఒకవేళ ఈ రేంజ్లో కలెక్షన్లు రాబడితే అక్షయ్ కుమార్ కెరీర్లోనే బెస్ట్ అని చెప్పుకోవచ్చు అని అంటున్నారు.
కేసరికి క్రిటిక్స్ ప్రశంసలు
అక్షయ్ కుమార్, పరిణితి చోప్రా జంటగా నటించిన కేసరి చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్పై కరణ్ జోహర్ నిర్మించారు. యాక్షన్, వార్ సీక్వెన్స్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి.