Don't Miss!
- News మేషరాశిలో బుధగ్రహ దహనం.. ఈ రాశులవారికి ప్రేమ, దాంపత్య జీవితంలో కష్టాలు!!
- Sports Hardik Pandya: అస్సలు ఊహించలేదు.. ఆ తప్పిదమే మా కొంపముంచింది!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ తప్పులను నిర్లక్ష్యం చేసిన వారు జీవితంలో ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంటారు...!
- Automobiles కొత్త కాంపాక్ట్ ఎస్యూవీ బసాల్ట్ విజన్ ఎస్యూవీని ఆవిష్కరించిన సిట్రోయెన్
- Technology WhatsApp ద్వారా విదేశాలకు డబ్బు పంపేందుకు కొత్త ఫీచర్! వివరాలు
- Travel శివ కళ్యాణోత్సవాలకు ముస్తాబైన వేములవాడ రాజన్న ఆలయం!
- Finance Hyderabad: తల్లి కోరిక తీర్చిన ఆనంద్ మహీంద్రా.. 4000 మంది విద్యార్థుల కోసం హైదరాబాదులో..
రికార్డులు తిరగరాస్తున్న మిషన్ మంగళ్.. 2.0 వసూళ్లపై కన్నేసిన అక్షయ్
బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తున్నది. ఈ చిత్రం కలెక్షన్లు అక్షయ్ కెరీర్లోనే అత్యధికంగా నిలిచాయి. విద్యాబాలన్, సోనాక్షి సిన్షా, తాప్సీ పన్ను, కృతి కుల్హారి, నిత్యా మీనన్, శర్మాన్ జోషి నటించిన ఈ చిత్రం రూ.200 కోట్లకు చేరువైంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్ల దృష్టి రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన 2.0పై పడింది. త్వరలోనే 2.0 చిత్ర వసూళ్లను అధిగమించే అవకాశం ఉంది.
ఆగస్టు 15న రిలీజ్ అయిన మిషన్ మంగళ్ చిత్రం ఇప్పటికే 18 రోజులు పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రం రూ.188 కోట్ల వసూళ్లను సాధించింది. ఆదివారం రూ.3 కోట్లు సాధించడంతో రూ.190 కోట్లు దాటేసింది. మూడో వారంలోకి ప్రవేశించిన ఈ సినిమా వారాంతానికి మొత్తం రూ.6 కోట్లు వసూలు చేయడం గమనార్హం.
మిషన్ మంగళ్ చిత్రం తొలి రోజున రూ.29.16 కోట్లు, వారాంతంలో రూ.97.56 కోట్లు, తొలివారంలో రూ.128.16 కోట్లు, రెండో వారంలో రూ.178.11 కోట్లు వసూలు చేసింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు, ఓవర్సీస్ కలెక్షన్లను కలిపితే ఇప్పటి వరకు రూ.251.16 కోట్లు వసూలు చేసింది.