Don't Miss!
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- News గెలిస్తే వాషింగ్టన్ డీసీ చేస్తా అన్నావ్.. రాజధానే లేకుండా చేశావ్ జగనన్నా.. షర్మిల చురకలు
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
దుమ్మురేపుతున్న మిషన్ మంగళ్.. 200 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు
స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ఇటీవలే విడుదలైన 'మిషన్ మంగళ్' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. చాలా రోజుల క్రితమే 150 కోట్ల మార్కును దాటేసిన ఈ సినిమా తాజాగా 200 కోట్ల క్లబ్లో చేరింది. ఈ మార్క్ రీచ్ కావడంతో మిషన్ మంగళ్ సరికొత్త రికార్డు నమోదైంది. ఆ వివరాలు చూద్దామా..
Recommended Video
ట్రేడ్ పండితుడు తరన్ ఆదర్శ్ ట్వీట్
విడుదలైన రోజు నుంచే భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న ‘మిషన్ మంగళ్' మూవీ నేటికీ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. చిత్రం లోని భారీ తారాగణం, కథ ప్రేక్షకులను కట్టి పడేస్తున్నాయి. దీంతో ఈ సినిమా పలు రికార్డులు తిరగరాస్తూ ముందుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా 200 కోట్ల క్లబ్లో చేరిందని పేర్కొంటూ ట్రేడ్ పండితుడు తరన్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.
అయ్యోపాపం 2.0.. చైనాలో దారుణంగా కలెక్షన్లు.. శంకర్, రజనీకి దిమ్మతిరిగేలా షాక్
తొలి 29 రోజుల్లో మిషన్ మంగళ్ జర్నీ
ఆగస్టు 15వ తేదీన విడుదలైన మిషన్ మంగళ్ మూవీ సక్సెస్ ఫుల్ జర్నీ కొనసాగిస్తూ 29 రోజుల్లో 200 కోట్లు రాబట్టడం విశేషం. తొలి మూడు రోజుల్లోనే 50 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా.. 5 రోజుల్లో 100 కోట్ల క్లబ్లో చేరింది. ఆ తర్వాత 11 రోజుల్లో 150, 14 రోజుల్లో 175 కోట్లు రాబట్టి చివరకు 29 రోజుల్లో 200 కోట్ల మార్క్ చేరుకుంది.
|
సరికొత్త రికార్డు.. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో
200 కోట్ల మార్క్ చేరుకున్న మిషన్ మంగళ్ మూవీ.. ఈ ఏడాది (2019) లో విడుదలైన సినిమాల్లో వేగంగా 200 కోట్ల క్లబ్లో చేరిన నాలుగో బాలీవుడ్ సినిమాగా రికార్డు నమోదు చేసింది. దీనికంటే ముందు వరుసగా.. కబీర్ సింగ్, భరత్, యూరి సినిమాలు ఈ లిస్టులో ఉన్నాయి.
మిషన్ మంగళ్ మూవీ
జగన్ శక్తి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్తో పాటు విద్యా బాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ పన్ను, క్రితి కుల్హరి, నిత్యా మీనన్, శర్మాన్ జోషి ముఖ్యపాత్రలు పోషించారు. ఇస్రో చేపట్టిన భారతదేశపు మొట్టమొదటి గ్రహాంతర మిషన్ - మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళ్యాన్) స్పూర్తితో ఈ సినిమా తెరకెక్కించారు.