Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఫైనల్ కలెక్షన్స్... నష్టం ఎంతో తెలుసా?
రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' తొలి షో నుంచే నెగెటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద బోల్తా పడిన సంగతి తెలిసిందే. నవంబర్ 16న విడుదలైన ఈ చిత్రం తొలి వీకెండ్తోనే ప్లాప్ అని తేలిపోయింది.
ఆదరణ లేక పోవడంతో ఇప్పటికే చాలా చోట్ల సినిమాను లేపేశారు. ఈ మూవీ రన్ అవుతున్న ఒకటీ అర థీయేటర్లలో కూడా ప్రదర్శన ఆగిపోవడంతో థియేట్రికల్ రన్ క్లోజ్ అయింది. విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మైత్రి మూవీస్ వారి ఈ యాక్షన్ ఎంటర్టెనర్ భారీ నష్టాన్నే మిగిల్చింది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వసూళ్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూలు చేసింది?
ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం ‘అమర్ అక్బర్ ఆంటోనీ' వరల్డ్ వైడ్ రూ. 6.20 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం థియేట్రికల్ రైట్ష్ రూ. 22 కోట్లకు అమ్మారు. దీంతో దాదాపు రూ. 16 కోట్ల నష్టం ఏర్పడినట్లయింది.
నైజాంలో నష్టం ఎంత?
నైజాం థియేట్రికల్ రైట్స్ రూ. 5.80 కోట్లకు అమ్మగా... రూ. 1.90 కోట్లు మాత్రమే రాబట్టింది. ఇక్కడ రూ. 4 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
అమర్ అక్బర్ ఆంటోని ఎఫెక్ట్: పవన్తో అనుకున్నారు, రవితేజతో కూడా.. చేతులెత్తేసిన మైత్రి!
సీడెడ్ ఏరియాలో భారీ లాస్
సీడెడ్ ఏరియా రైట్స్ రూ. 3.30 కోట్లకు అమ్మగా... కేవలం రూ. 89 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. దీంతో ఇక్కడ కూడా భారీ నష్టం తప్పలేదు.
ఆంధ్ర ఏరియాలో
ఉత్తరాంధ్ర రైట్స్ రూ.2.30 కోట్లకు అమ్మగా రూ. 60 లక్షల షేర్.... గుంటూరు రైట్స్ రూ. 1.80 కోట్లకు అమ్మగా రూ. 65 లక్షలు, ఈస్ట్ గోదావరి రైట్స్ రూ. 1.50 కోట్లకు అమ్మగా..రూ. 38 లక్షలు, వెస్ట్ గోదావరి రైట్స్ రూ. 1.25 కోట్లకు అమ్మగా రూ. రూ. 32 లక్షలు... కృష్ణ రైట్స్ రూ. 1.45 కోట్లకు అమ్మగా రూ. 30 లక్షలు... నెల్లూరు రైట్స్ రూ. 80 లక్షలకు అమ్మగా రూ. 19 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది.
రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్
రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 2.20 కోట్లకు అమ్మగా రూ. 50 కోట్ల షేర్, ఓవర్సీస్ రైట్స్ రూ. 1.60 కోట్లకు అమ్మగా రూ. 49 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం.