Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
చైనాలో చిన్న సినిమా కలెక్షన్ల సునామీ.. 150 కోట్లతో భారీ విజయం వైపు పరుగులు
బాలీవుడ్లో ఘన విజయం సాధించిన అంధాదూన్ చిత్రం చైనా బాక్సాఫీస్ను కుదిపేస్తున్నది. శ్రీరాం రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయవంతంగా రెండోవారంలోకి ప్రవేశించింది. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే తదితరులు ఈ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలై బాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకోవడం దేశీయ ట్రేడర్లను అప్పట్లో ఆశ్చర్యానికి చేసింది. తాజాగా ట్రేడ్ అనలిస్టుల ఊహలకు అందని విధంగా ఈ సినిమా విజయం సాధించడం గమనార్హం. వివారాల్లోకి వెళితే..
చైనాలో 150 కోట్ల క్లబ్ను దాటేసి
అంధాదూన్ చిత్రం చైనాలో రూ.150 కోట్ల మైలురాయిని దాటింది. సక్సెస్ఫుల్గా రెండోవారంలోకి ప్రవేశించింది. రెండోవారంలో 25 మిలియన్ డాలర్లు వసూళ్లను అధిగమించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటి వరకు 21.76 ఈ చిత్రం 21.76 మిలియన్ డాలర్లు వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు.
ఇండియాలోనే కాదు.. చైనాలో కూడా
అంధాదూన్ చిత్రంలో ఆయుష్మాన్ పియానిస్ట్గా నటించాడు. ఈ సినిమా చైనాలో భారీ కలెక్షన్లు సాధించడంపై ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంధాదూన్ భారీ వసూళ్లు రాబట్టడం చాలా గర్వంగా ఉంది. ఇండియాలోనే కాదు చైనాలో కూడా బ్లాక్బస్టర్ కావడంతో ఈ విజయం ఊహకు అందడం లేదు. శ్రీరాం రాఘవన్ విజనరీ ఉన్న డైరెక్టర్. సక్సెస్ ప్రధాన కారణం ఆయనే అని ఆయుష్మాన్ అన్నారు.
అంధాదూన్ వసూళ్లును నమ్మలేకపోతున్నాం
చైనాలో అంధాధూన్ రూ.100 కోట్లు దాటిందనే వార్తతోనే సంతోషంలో మునిగిపోయాను. ఇప్పుడు రూ.150 కోట్లు దాటేసిందంటే నమ్మలేకపోతున్నాం. ఈ చిత్రంలో నటించినందుకు చాలా గర్వపడుతున్నాం. ప్రపంచ సినిమా రంగంలో అంధాదూన్కు ఈ స్థానం దక్కడం చాలా ఆనందంగా ఉంది అని చిత్ర యూనిట్ సభ్యులు అన్నారు.
నాకు థ్రిల్లింగ్గా ఉంది
దర్శకుడు శ్రీరాం రాఘవన్ మాట్లాడుతూ.. అంధాదూన్ చైనాలో రిలీజ్ కావడంతోనే నేను థ్రిల్గా ఫీలయ్యాను. పదేళ్ల క్రితం చైనా సందర్శనకు వెళ్లినపుడు బీజీంగ్ కేఫ్ వద్ద తిరిగాను. ఆ సమయంలో నాసిర్ హుస్సేన్ కార్వాన్ ప్రదర్శించడం చూశాను. ఇప్పుడు మా సినిమా కూడా అక్కడే విజయవంతంగా ప్రదర్శించడం ఆనందంగా ఉంది. పైగా 150 కోట్లు వసూలు చేయడం మరింత సంతోషంగా ఉంది అని అన్నారు.