Don't Miss!
- News మైలవరం టీడీపీలో బయటపడ్డ విభేదాలు
- Sports SRH Playing XI: అతనిపై వేటు..RCBతో తుది జట్టు ఇదే!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
‘అత్తారింటికి దారేది’ రికార్డుకి... 5 కోట్లు బ్యాలెన్స్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం కలెక్షన్స్ కి మగధీర చిత్రం కలెక్షన్స్ క్రాస్ చేస్తుందా లేదా...క్రాస్ చేస్తే ఎంత కాలంలో చేస్తుందనేది మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం. ట్రేడ్ అంచనాలు ప్రకారం మూడు వారాల్లో అత్తారింటికి దారేది చిత్రం 68 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది. మగధీర ఇప్పటివరకూ 73 కోట్లు వసూలుచేసి రికార్డ్ ఉంది. మరో ఐదు కోట్లు కలెక్ట్ చేసి నాలుగో వారంలో ఈ రికార్డుని దాటుతుందని చెప్తున్నారు.
మరో ప్రక్క ఇప్పటికే ఏరియా వైజ్ చూస్తే... నైజాం ఏరియాలో ఈ రోజుతో 20 కోట్ల మార్కును క్రాస్ అయింది. 'మగధీర' సినిమా తర్వాత నైజాం ఏరియాలో రూ.20 కోట్ల మార్కు దాటిన సినిమా ఇదే కావడం గమనార్హం. కలెక్షన్స్ ఇంకా స్టేబుల్గా ఉన్నాయని ట్రేడ్ వర్గాల టాక్. మరి సినిమా ఇక్కడ ఇంకా ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు దాదాపు రూ. 68 కోట్లు వసూలు చేసిందని అంచనా...ఒక ఏపీలోనే మొత్తం రూ. 50 కోట్ల షేర్ సాధించినట్లు చెబుతున్నారు. సినిమా జోరు చూస్తుంటే కలెక్షన్ల పరంగా నెం.1 పొజిషన్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.