Don't Miss!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- News మోదీని ప్రధానిని చెయ్యండి.. తెలంగాణాలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భాగీ3 మూవీకి కోలుకోని దెబ్బ.. కండలు కరిగించినా కష్టంగా కలెక్షన్లు
బాలీవుడ్లో భారీ అంచనాలతో రిలీజైన భాగీ3 చిత్రం బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురవుతున్నది. శ్రద్దాకపూర్, టైగర్ ష్రాఫ్ నటించిన ఈ చిత్రం మార్చి 6న అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే కరోనా వైరస్ ధాటికి అన్ని సినిమాలకు తగిలినట్టే భాగీ3 సినిమాకు కూడా గట్టి దెబ్బే తగిలిందనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది. గత నాలుగు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కరోనా వైరస్ దెబ్బకు
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభించడం భాగీ సినిమా వసూళ్లపై భారీగానే ప్రభావం పడింది. రూ.20 నుంచి రూ.25 కోట్ల మధ్య లక్ష్యంతో రిలీజైన ఈ చిత్రం తొలిరోజున ఈ చిత్రం రూ.17.50 కోట్లతో సరిపెట్టుకొన్నది. శనివారం రూ.16 కోట్లకు పడిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురిచేసింది.
సెలవు దినంగా ఘనంగా.. సోమవారం డీలా
ఇక ఆదివారం సెలవు దినం కావడంతో భాగీ3 మెరుగైన కలెక్షన్లను సాధించింది. ఆదివారం రూ.20 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడంతో డిస్టిబ్యూటర్లు ఊరట చెందారు. ఇక బాక్సాఫీస్కు లిట్మస్ టెస్ట్గా మారిన సోమవారం మరీ దారుణంగా రూ.9 కోట్లకు మాత్రమే పరిమితమైంది. దాంతో దేశవ్యాప్తంగా ఈ చిత్రం రూ.63 కోట్లు రాబట్టిందనేది ట్రేడ్ రిపోర్టు.
ఓవర్సీస్ రిపోర్టు ఇలా..
ఇక భాగీ ఓవర్సీస్ రిపోర్టు చేస్తే.. అమెరికా, కెనడాలో ఈ చిత్రం 508 వేల డాలర్లు, యూఏఈ, జీసీసీలో 950 వేల డాలర్లు, యూకేలో 214 వేల డాలర్లు, ఆస్ట్రేలియాలో 156 వేల డాలర్లు, రెస్టాఫ్ వరల్డ్ 482 వేల డాలర్లను నమోదు చేసింది. దాంతో ఓవర్సీస్లో 2310 డాలర్లు అంటే 17 కోట్లు గ్రాస్ వసూళ్లను వసూలు చేసింది.
100 కోట్ల వైపు పరుగులు
కరోనా వైరస్ కారణంగా భాగీ3 చిత్రం తొలి వారాంతానికి అతికష్టం మీద 50 కోట్ల రూపాయల క్లబ్ను దాటేసింది. ప్రస్తుత సరళిని చూస్తే రానున్న రోజుల్లో రూ.100 కోట్లకు చేరువయ్యే అవకాశం కనిపిస్తున్నది. రితేష్ దేశ్ముఖ్, అంకితా లోఖండే, జైదీప్ అహ్లావత్, విజయ్ వరమ తదితరులు నటించిన ఈ చిత్రంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్నది.