‘బాహుబలి’.... నైజాంలో 20 కోట్లు క్రాస్ అయింది
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' మూవీ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తూ దూసుకెలుతోంది. కలెక్షన్ల పరంగా టాలీవుడ్లో అన్ని రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్లోనూ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.
తాజాగా ‘బాహుబలి' చిత్రం నైజాం ఏరియాలో రూ. 20 కోట్ల(షేర్) మార్కును అధిగమించింది. తొలి 6 రోజుల్లోనే బాహుబలి ఈ ఫీట్ సాధించడం విశేషం. ఇప్పటి వరకు నైజాం ఏరియాలో ఇంత ఫాస్ట్ గా రూ. 20 కోట్లు వసూలు చేసిన సినిమా ఇదే కావడం విశేషం. నైజాం కలెక్షన్ల వివరాలు రోజు వారీగా ఇలా ఉన్నాయి.

శుక్ర వారం: 6.22 కోట్లు
శనివారం: 3.55 కోట్లు
ఆదివారం: 3.65 కోట్లు
సోమవారం: 2.82 కోట్లు
మంగళవారం: 2.20 కోట్లు
బధవారం: 2.20 కోట్లు
టోటల్ 6 రోజుల్లో: 20.64 కోట్లు
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన బాహుబలి రెండు భాగాలు కలిపి రూ. 250 కోట్లతో తెరకెక్కింది. ప్రస్తుతం విడుదలైన తొలి భాగా ‘బాహుబలి-ది బిగినింగ్' అంచనాలకు మించిన వసూళ్లు సాధిస్తోంది. రెండో భాగం 2016లో విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











