Don't Miss!
- News కేసీఆర్ కు రేవంత్ వార్నింగ్ - ఇక లెక్క పెట్టుకో..!!
- Technology ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Sports సూర్య సిగ్గుపడాలి.. క్రీడాస్ఫూర్తిని మరిచి నీఛమైన పని!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
Veera Simha Reddy 25 Days Collections: లాభాల వైపుగా బాలయ్య సినిమా.. నేటికి ఎన్ని కోట్లు వచ్చాయంటే?
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి. మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలోకి జనవరి 12న దిగింది. స్టార్ క్యాస్టింగ్ ఉన్న ఈ సినిమాలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేసి అదరగొట్టాడని టాక్ వచ్చింది. మరోసారి బాలయ్య బాబు తన నట విశ్వరూపం చూపించారని ఫ్యాన్స్ కొనియాడారు.
బాలకృష్ణ గత సినిమాల తరహాలోనే ఫ్యాన్స్ మెచ్చేలా ఉన్న వీర సింహా రెడ్డి మూవీ కలెక్షన్లవైపు దుసుకుపోతోంది. ఈ క్రమంలో బాలకృష్ణ వీర సింహా రెడ్డి 25 రోజుల వసూళ్ల వివరాల్లోకి వెళితే..
హనీ రోజ్ పాత్రకు..
మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలయ్య బాబు తొలిసారిగా నటించిన పవర్ఫుల్ యాక్షన్ మూవీ 'వీర సింహా రెడ్డి'. ఈ సినిమాలో బ్యూటిఫుల్ శృతి హాసన్ హీరోయిన్ గా చేయగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్ వంటి వివిధ ఇండస్ట్రీకి చెందిన స్టార్లు నటించారు.
అలాగే హనీ రోజ్ పాత్రకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి నిర్మించగా.. ఎస్ఎస్ తమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు.
ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు..
అన్ స్టాపబుల్ గా దూసుకుపోతున్న బాలకృష్ణ లేటెస్ట్ సినిమా 'వీర సింహా రెడ్డి'కి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్లో రూ. 13 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 33.30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 61.30 కోట్ల బిజినెస్ చేసుకుంది.
అలాగే, కర్నాకటలో రూ. 4.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1 కోటి, ఓవర్సీస్లో రూ. 6.20 కోట్లతో కలిపి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్ల బిజినెస్ చేసింది వీర సింహా రెడ్డి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా ఫిక్స్ అయింది.
25వ రోజు ఎంతొచ్చిందంటే..
బాలకృష్ణ-గోపిచంద్ మలినేని కాంబినేషన్ మూవీ 'వీర సింహా రెడ్డి'కి మంచి టాక్ లభించింది. వీర సింహా రెడ్డి సినిమాలో వరలక్ష్మీ విలనిజనానికి మంచి మార్కులు పడినట్లుగా చెబుతున్నారు.
ఇలా పాజిటివ్ టాక్ తో వీర సింహా రెడ్డి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 25వ రోజు నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు ఇలా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం.
|
తెలుగు రాష్ట్రాల్లో 25 రోజులకు కలిపి..
బాలకృష్ణ-శ్రుతిహాసన్ జంటగా నటించిన 'వీర సింహా రెడ్డి'కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 25 రోజుల్లో బాగానే కలెక్షన్స్ రాబట్టింది. ఫలితంగా 25 రోజుల్లో నైజాంలో రూ. 17.31 కోట్లు, సీడెడ్లో రూ. 16.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8.55 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 6.60 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.90 కోట్లు, గుంటూరులో రూ. 7.42 కోట్లు, కృష్ణాలో రూ. 4.73 కోట్లు, నెల్లూరులో రూ. 3 కోట్లతో కలుపుకుని టోటల్ గా రూ. 69.01 కోట్లు షేర్, రూ. 112.25 కోట్లు గ్రాస్ వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా 25 రోజుల కలెక్షన్లు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో 25 రోజుల్లో రూ. 69.01 కోట్లు కొల్లగొట్టిన బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' సినిమా వరల్డ్ వైడ్ గా సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.85 కోట్లు, ఓవర్సీస్లో రూ. 5.77 కోట్లు వసూలు చేసింది. వీటితో కలిపితే 25 రోజుల్లో బాలయ్య బాబు వీర సింహా రెడ్డి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 79.63 కోట్లు షేర్, రూ. 133.55 కోట్లు గ్రాస్ వచ్చింది.
ఎన్ని కోట్ల లాభం అంటే..
క్రేజీ కాంబినేషన్లో రూపొందిన 'వీర సింహా రెడ్డి' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 74 కోట్లుగా నమోదైంది. ఇక వీర సింహా రెడ్డికి 25 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 79.63 కోట్లు వచ్చాయి. అంటే వీర సింహా రెడ్డి సినిమా 2 వారాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయగా.. 25వ రోజుకి రూ. 5.63 కోట్ల లాభంతో క్లీన్ హిట్ గా నిలిచింది.