Don't Miss!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
50 కోట్లు కొల్లగొట్టిన బాట్లా హౌస్.. ట్రేడ్ వర్గాలకు షాకిచ్చేలా జాన్ అబ్రహం
బాలీవుడ్ చిత్రం బాట్లా హౌస్ అంచనాలకు మంచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది. ఇండిపెండెన్స్ డే రోజున విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను దడదడలాడిస్తున్నది. తొలి ఆట నుంచి మంచి టాక్తో కలెక్షన్ల వేగం పెంచింది. జాన్ అబ్రహం, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచి భారీ వసూళ్లను రాబట్టింది.
గురువారం తొలి రోజునే రూ.14.50 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం రూ.7.50 కోట్లు, శనివారం రూ.9.50 కోట్లు మాత్రమే వసూలు చేసి కొంత నిరాశ పరిచింది. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఆదివారం సెలవు దిన కావడంతో వసూళ్లు పరుగులు పెట్టాయి. ఏకంగా ఆదివారం రూ.12 కోట్లు కలెక్ట్ చేసింది. ఢిల్లీ, యూపీలో ఈ సినిమాకు అత్యంత ప్రజాదరణ దక్కడంతో వారాంతానికి రూ.47.99 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఢిల్లీలోని బాట్లా హౌస్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కింది. బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరిజ్ ఖాన్, షెహ్జాద్ ఆహ్మద్ ఈ సినిమా రిలీజ్ నిలిపివేయాలని కోర్టులో కేసు వేశారు. అయితే వారి పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.