Don't Miss!
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
50 కోట్లు కొల్లగొట్టిన బాట్లా హౌస్.. ట్రేడ్ వర్గాలకు షాకిచ్చేలా జాన్ అబ్రహం
బాలీవుడ్ చిత్రం బాట్లా హౌస్ అంచనాలకు మంచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది. ఇండిపెండెన్స్ డే రోజున విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ను దడదడలాడిస్తున్నది. తొలి ఆట నుంచి మంచి టాక్తో కలెక్షన్ల వేగం పెంచింది. జాన్ అబ్రహం, మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచి భారీ వసూళ్లను రాబట్టింది.
గురువారం తొలి రోజునే రూ.14.50 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం రూ.7.50 కోట్లు, శనివారం రూ.9.50 కోట్లు మాత్రమే వసూలు చేసి కొంత నిరాశ పరిచింది. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై సినీ విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక ఆదివారం సెలవు దిన కావడంతో వసూళ్లు పరుగులు పెట్టాయి. ఏకంగా ఆదివారం రూ.12 కోట్లు కలెక్ట్ చేసింది. ఢిల్లీ, యూపీలో ఈ సినిమాకు అత్యంత ప్రజాదరణ దక్కడంతో వారాంతానికి రూ.47.99 కోట్లు వసూలు చేసింది. త్వరలోనే ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఢిల్లీలోని బాట్లా హౌస్లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కింది. బాట్లా హౌస్ ఎన్కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరిజ్ ఖాన్, షెహ్జాద్ ఆహ్మద్ ఈ సినిమా రిలీజ్ నిలిపివేయాలని కోర్టులో కేసు వేశారు. అయితే వారి పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.