Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నాగ్ ‘డమరుకం’వైజాగ్ రైట్స్ ఆ నిర్మాతకి
హైదరాబాద్ : నాగార్జున తొలి సోషియో ఫాంటసీ చిత్రం ఢమరుకం. ఈ చిత్రం అక్టోబర్ 12 న విడుదల చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వైజాగ్ రైట్స్ ని బెల్లంకొండ సురేష్ తీసుకున్నారు. రెండు కోట్లు ఇరవై లక్షలకు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు ఓ ఇంగ్లీష్ డైలీ ప్రచురించింది. నాగార్జున చిత్రం ఈ రేంజి రేటు పలకటం ట్రేక్ లో షాక్ అంటున్నారు. అందులోనూ అదే రోజున సూర్య చిత్రం డూపిక్లేట్ కూడా విడుదల అవుతోంది. దాన్ని సైతం బెల్లంకొండ సురేష్ విడుదల చేయటం విశేషం.
'డమరుకం'గురించి నాగార్జున మాట్లాడుతూ... శివుడికీ, మనిషికీ మధ్య సాగే సోషియో ఫాంటసీ కథాంశం. అలాగని భక్తి, ఆధ్యాత్మికం తరహా విషయాలేవీ ఇందులో ఉండవు. పక్కా మాస్ సినిమా. 45 నిమిషాల పాటు గ్రాఫిక్స్ ఉంటాయి. 'డమరుకం' మే నెలలోనే విడుదల కావాలి. గ్రాఫిక్స్ వల్ల ఆలస్యమైంది. నిన్ననే కొంత పోర్షన్ గ్రాఫిక్స్ చూశా. అద్భుతంగా ఉంది. ఒక పాట షూట్ చేయాలి. మంచి మాస్, కమర్షియల్ ఫిల్మ్ అవుతుంది. నాకిదే తొలి సోషియో ఫాంటసీ సినిమా అన్నారు.
అలాగే 'డమరుకం' సిజి వల్లే ఆలస్యం అని చెప్పారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలోని 'డమరుకం' చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత ఆర్.ఆర్.వెంకట్ రాజీ లేకుండా ఖర్చు చేస్తున్నారీ సినిమాకి. సోసియోఫాంటసీ కథలో మాస్ మసాలాను అద్భుతంగా మిక్స్ చేసి దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. నాగార్జున 25ఏళ్ల కెరీర్లో ఎవరూ చేయని కొత్త తరహా చిత్రమిది. బ్యాలెన్స్ పాటను ఈ నెల 30నుంచి చిత్రీకరిస్తున్నారు.
సెప్టెంబర్ 10న ఆడియో, అక్టోబర్ 12న సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2012నాటికి ప్రపంచం ఉండదు..అనే కాన్పెప్టుతో హాలీవుడ్ సినిమాలెన్నో వచ్చాయి. ఆ తరహా చిత్రమిది. గ్రహాల తీరుపెై స్పృషించారు. బొట్టు శీను తరహా మాస్ పాత్ర మరో హైలెైట్ . తాను, నాగచైతన్య, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించే సినిమా చిత్రం గురించి చెపుతూ..విక్రమ్ కె.కుమార్ కథ చెప్పాడు. నాక్కూడా బాగా నచ్చింది. అయితే ఆ చిత్రం వచ్చే యేడాది సెట్స్పైకి వెళ్లే అవకాశాలున్నాయి అన్నారు నాగార్జున. అలాగే బెల్లంకొండ సురేష్ తో ఆయన త్వరలో ఓ చిత్రం చేస్తున్నారు.