Don't Miss!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ప్రపంచ కప్ను ఎదురించిన భారత్.. రూ.200 కోట్ల క్లబ్లోకి!
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన భారత్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సానుకూలమైన జోరును కొనసాగిస్తున్నది. ఆదివారం భారత, పాకిస్థాన్ ప్రపంచ కప్ జరిగిన సమయంలో ఈ సినిమా కలెక్షన్లు పడిపోతాయని భావించారు. అయితే మ్యాచ్ను లెక్క చేయకుండా భారత్ చిత్రం నిలకడగా మోస్తారు వసూళ్లు సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. రిలీజ్ తర్వాత రెండో ఆదివారం రోజున ఎదురైన అగ్ని పరీక్షను ఎదుర్కొని ఎంత మేరకు కలెక్షన్లు సాధించిందంటే..
ఎక్కువ సంఖ్యలో భారీగా
బాలీవుడ్లో ప్రస్తుత వారం ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యాయి. గేమ్ ఓవర్, ఖామోషీ, ఖేల్ ఖల్లాస్, కిస్సేబాజ్, రెస్క్యూ, ది జోడి, ఎంఐబీ: ఇంటర్నేషనల్ తదితర చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే భారత్ ముందు ఈ సినిమాలు నిలబడలేకపోవడం, అంతేకాకుండా కొంత మేరకైనా పోటీని ఇవ్వకపోవడం ట్రేడ్ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
సానుకూలమైన టాక్తో ముందుకు
భారత్ చిత్రం రూ.100 కోట్లతో రూపొందింది. సినీ విమర్శకులు, ప్రేక్షకుల సానుకూల టాక్తో తొలివారం భారీ వసూళ్లను సాధించింది. తొలివారాంతం తర్వాత సోమవారం నుంచి శుక్రవారం వరకు కలెక్షన్లు క్షీణించాయి. అయితే శుక్రవారం ఈ సినిమా కలెక్షన్లు గతం రోజుకంటే 50 శాతం మేర పెరిగాయి. దాంతో రెండో వారాంతం ఈ సినిమా కలెక్షన్లు పుంజుకొన్నాయి.
రెండో వారంలో వసూళ్లు
భారత్ చిత్రం రెండో వారంలో శుక్రవారం రూ.3.75 కోట్లు వసూలు చేసింది. శనివారం ఈ చిత్రం రూ.6 కోట్లు రాబట్టింది. ఇండియా, పాక్ మ్యాచ్ ఉన్నప్పటికీ ఆదివారం కూడా రూ.6 కోట్లతో సరిపెట్టడం గమనార్హం. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.188 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. ఎక్కువగా కలెక్షన్లు ఢిల్లీ, యూపీ నుంచే రావడం గమనార్హం.
రూ.200 కోట్లకు చేరువలో
భారత్ చిత్రం తొలివారం ఘనంగా వసూళ్ల జైత్రయాత్రప్రారంభించింది. తొలివారం ఈ చిత్రం రూ.172.25 కోట్లు వసూలు చేసింది. ప్రపంచ కప్ ఫీవర్ ఊపందుకోవడంతో రెండో వారం కొంత తగ్గుముఖం పట్టింది. రెండో వారంలో మూడురోజుల్లో కేవలం 16 కోట్లు మాత్రమే వసూలు చేయడంతో రూ.200 కోట్ల క్లబ్లో చేరడానికి కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం రూ.188 కోట్ల వసూళ్లను నమోదు చేయడం గమనార్హం.